SDPT: ప్రజాప్రతినిధులు ప్రజాసేవే లక్ష్యంగా మెరుగైన సేవలు అందించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ హైమావతి అధ్యక్షతన జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వాటిని అర్హులైన ప్రజలకు చేరాలన్నారు.