సత్యసాయి: సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ను అరికట్టాలని ప్రజా సంఘాలు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మద్యం, జూదం, మట్కా పెరిగిపోతున్నాయని, మండలంలో ప్రశాంతతకు భంగం కలుగుతోందని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి నివాస ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి, యువతను రక్షించాలని కోరారు.
SRD: ప్రజలకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురంలోని రేషన్ దుకాణాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఒక్క కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడోసారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. కాకాణి నెల్లూరుకు చేరుకున్న వెంటనే నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాణికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి కార్యాచరణకు సంబంధించి పోలీసులు చర్చిస్తున్నారు.
NRML: సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మామడ మండల కేంద్రంలోని రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి, లబ్దిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, రేషన్ యజమానులకు పలు సూచనలు సలహాలు చేశారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మళ్లీ ట్రోలింగ్కు గురయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో బాబర్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్కు చేరాడు. దీంతో బాబర్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడని.. మరో 99 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తృటిలో సెంచరీ చేజారిపోయిందంటూ మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు.
కృష్ణా: పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని విజయ డెయిరీ వద్ద సీపీఐ ధర్నా చేపట్టింది. సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ.. సామాన్య వర్గాలకు పౌష్టికాహారం దూరం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయవాడ విజయ డెయిరీ రెండు రూపాయలు చొప్పున పెంచిన పాల ధరలను తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది.
KNR: సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం రామడుగు మండలం వేదిర గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సన్న బియ్యం ఉచిత పంపిణి ప్రారంభించారు. దేశ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టారన్నారు.
టాప్ ర్యాంక్ ఆటగాళ్ల పేర్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. యువ బ్యాటర్ శుభమన్ గిల్ వన్డేల్లో అగ్రస్థానంలో నిలువగా, టీ20ల్లో నెంబర్ వన్ ఆల్రౌండర్గా హార్థిక్ పాండ్య స్థానం దక్కించుకున్నాడు.
TG: ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. దేశానికి ఓ రోల్ మోడల్గా తెలంగాణ నిలిచింది. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని మేం కోరాం. ఇందుకు అనుమతి ఇచ్చేందుకు మోదీకి ఇబ్బంది ఏంటి?’ అని ప్రశ్నించారు.
కృష్ణా: ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు.
కృష్ణా: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఓఎన్జీసీ సంస్థ సభ్యులు మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి ఎక్కవగా ఉండటంతో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని సభ్యులు తెలిపారు.
కృష్ణా: విజయవాడ ఆటోనగర్లో మంగళవారం రాత్రి లక్ష్మీ అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ పడి ఉన్న ప్రాంతాన్ని ఏసీపీలు పవన్ కిషోర్, దామోదర్ పరిశీలించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. భర్త మహంకాళి పరారీలో ఉన్నట్టు చెప్పారు.
JN: సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతిని పురస్కరించుకుని లింగాల ఘన్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాన్ని ఎమ్మెల్యే ప్రజలకు గుర్తు చేశారు.
PDPL: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్ &రామగుండం కార్పొరేషన్ ఇంఛార్జ్ కమిషనర్ అరుణ శ్రీ పేర్కొన్నారు. డివిజన్లలో ఉన్న సమస్యలను తీర్చేందుకు ఆన్లైన్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 14420 నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
ఖమ్మం: రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ను టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు.