• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పన్ను వసూలు 100% పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

NRML: పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఇవాళ నిర్మల్ పట్టణంలో వివిధ కాలనీలలో జరుగుతున్న పన్నుల వసూలు, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో పనులు చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 19, 2025 / 05:21 PM IST

CHAMPIONS TROPHY: తొలి సెంచరీ చేసిన విల్‌యంగా

కరాచీ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో కివిస్ ఓపెనర్ విల్‌యంగా సత్తా చాటాడు. 107 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో ఒక సిక్స్, 11 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్‌లో అతడికిది నాలుగో సెంచరీ. క్రీజులో ఉన్న మరో కివిస్ ఆటగాడు లేథమ్ కూడా అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కివిస్ స్కోర్ 34.3 ఓవర్లలో 173/3

February 19, 2025 / 05:19 PM IST

‘బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రాకపోకలు నిషేధం’

KKD: గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పుష్కర – పోలవరం కాలువ గట్టుపై ఉన్న కోళ్ల ఫారంలో మరో 2500 కోళ్లు మంగళవారం మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్కఫారంలోనే 6వేల కోళ్లు చనిపోయాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా గోతులు తీసి ఖననం చేశారు. బర్డ్ ఫ్లూ అనుమానిత కోళ్లు ఖననం చేసిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ప్రజలు, వాహన రాకపోకలు నిషేధమంటూ ఫ్లెక్సీలు పెట్టారు.

February 19, 2025 / 05:15 PM IST

‘నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలే’

KKD: మహాశివరాత్రి ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రంలో బుధవారం ఈవో బల్ల నీలకంఠం అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

February 19, 2025 / 05:07 PM IST

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

CTR: పుంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్‌లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, పెద్దలు, మహిళలు జై భవాని, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 19, 2025 / 05:01 PM IST

‘సర్వేను వేగవంతం చేయాలి’

కోనసీమ: భూముల పునః సర్వే ప్రక్రియను వేగవంతం చేసి మార్చి నెలాఖరుకి గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ ప్రభాకరరెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

February 19, 2025 / 05:00 PM IST

నంద్యాల సభకు పుంగనూరు నుంచి ఉచిత బస్సులు

CTR: SDPI పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో రేపు (గురువారం) జరిగే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని పార్టీ జిల్లా నాయకుడు యూసుఫ్ తెలిపారు. ఇవాళ పుంగనూరులో ఆయన మాట్లాడుతూ ‘వక్ఫ్ రక్షణ సమాజ సంక్షేమం’ అనే నినాదంతో సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పుంగనూరు నుండి వెళ్లేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 19, 2025 / 05:00 PM IST

రేపు సబ్సిడీ లోన్లకు ఇంటర్వ్యూలు కార్యక్రమం

NLR: బీసీ, కాపు, ఈ బీసీ, తదితర కార్పొరేషన్ల నుండి సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ విడవలూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నగేష్ కుమారి కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు సబ్సిడీ లోన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంబంధిత సర్టిఫికెట్లతో ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

February 19, 2025 / 04:58 PM IST

రాజశేఖర్‌కి మద్దతుగా టీడీపీ నాయకులు ప్రచారం

కోనసీమ: ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ మద్దతుగా అమలాపురంలో టీడీపీ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురం పట్టణంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజశేఖర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు

February 19, 2025 / 04:57 PM IST

‘ప్రభుత్వానికి విక్రయించి గిట్టుబాటు ధర పొందండి’

NLR: వెంకటాచలం మండలం చవటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వానికి విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.

February 19, 2025 / 04:56 PM IST

‘తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి’

NRML: వికలాంగుల పెన్షన్ కొరకు తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై, సర్టిఫికెట్లు మంజూరు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ.. జిల్లాలో వందలకు పైగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొంది అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని అన్నారు.

February 19, 2025 / 04:29 PM IST

VIRAL: జగన్ ముద్దు పెట్టిన పాపపై ట్రోలింగ్

AP: వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో భాగంగా ఓ చిన్నారికి ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఆ పాప తనకు అమ్మఒడి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసి, స్కూలుకు వెళ్లటం లేదని చెప్పింది. కాగా.. ఆ పాప పేరు దేవికా రెడ్డి అని, ఆమె తండ్రికి బంగారం షాపు ఉందని తెలుస్తోంది. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లో ఎక్కువ ఖర్చు పెట్టి చదువుతున్నట్లు నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.

February 19, 2025 / 02:27 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ: టాస్ గెలిచిన పాకిస్థాన్

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడుతోంది. దీంట్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ రెండు టీంలు టీమిండియా తలపడే గ్రూపులోనే ఉన్నాయి.

February 19, 2025 / 02:17 PM IST

‘ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’

JN: పాలకుర్తిలో బీఎస్పీ నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ అధ్యక్షుడు ఈదునూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజన నాయకులను టార్గెట్ చేసిందని విమర్శించారు.

February 19, 2025 / 02:07 PM IST

‘అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’

JN: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. ఇవాళ జనగామ మండలం యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.

February 19, 2025 / 01:59 PM IST