JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ లింబాద్రి అన్నారు. మెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదరాన్ని తొలగించి చెత్త ఆటోలో తరలించారు.
RR: FCI కాలనీ పార్కులో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళల కోసం నిర్వహించిన మ్యూజికల్ చైర్, తగ్ ఆఫ్ వార్ వంటి పలు క్రీడా పోటీల్లో 500 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు రూ.5,000, రూ.3,000 విలువైన బహుమతులు ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ నెల 19న నిర్వహించనున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించారు. కాగా, ఇటీవల చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
VKB: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం మర్చిపోయిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఫిక్స్డ్ వేతనం చేస్తామని రూ.18 వేలు ఇస్తామని ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత రూ.50 లక్షల ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
WGL: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేరూ వినిపిస్తున్నట్లు సమాచారం. పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేసి గెలుపొందిన సీనియర్ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాడు.
‘ముంబై ఇండియన్స్’కు చెందిన అన్ని ఫ్రాంచైజీలకు ఆడిన తొలి ఆటగాడిగా ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. ఇప్పటికే IPLలో MI, మేజర్ లీగ్ క్రికెట్లో MI న్యూయార్క్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో MI ఎమిరేట్స్, SA20 లీగ్లో MI కేప్టౌన్ జట్లకు ఆడాడు. తాజాగా ‘ద హండ్రెడ్’ లీగ్లో MI లండన్ జట్టుకు ఎంపిక కావడంతో ఈ ఘనత సాధించాడు.
TG: మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆయన నివాసంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు.. కమిటీ ఏర్పాటుపై ప్రాథమికంగా సమావేశమయ్యారు.
KDP: ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డితోట సువర్ణ పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఎంఏ హిస్టరీలో ప్రతిభ కనబర్చిన ఆమెకు శుక్రవారం జరగనున్న వైవీయూ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ప్రొద్దుటూరులోని రిలయన్స్ మార్ట్లో పిజ్జా సర్వర్గా పనిచేస్తున్న సువర్ణకు ప్రజలు అభినందనలు తెలిపారు.
W.G: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్.. *చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. శివం గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వేగంగా వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ సినీ రంగంలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బన్నీ చిత్రాలు భవిష్యత్తులో హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై మన సినిమా సత్తా చాటాలని పేర్కొన్నారు.
TG: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గతంలో పోలీసులు సీజ్ చేసిన దాదాపు 50 బైకులు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయి. చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
TG: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్లలో ఘోరం జరిగింది. రెండో బోరు వేసే విషయంలో భర్తతో జరిగిన వివాదంతో ఆవేశానికి గురైన జంగమ్మ.. తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శైలజ ప్రాణాలు కోల్పోయారు. అయితే, కుమారుడు జస్వంత్ చాకచక్యంగా బావి అంచును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
TG: HYDలోని అంబర్పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్ సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్పేట పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్, GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్కు పంపారు.