• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోదుకొండమ్మ అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే

SKLM: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా పాడేరులో ఉన్న మోదు కొండమ్మ తల్లిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కు కున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

February 19, 2025 / 07:11 PM IST

మార్చి 2వ తేదీలోగా సర్వే పూర్తి కావాలి: కలెక్టర్‌

NLR: సున్నా పేదరికమే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందిచే పి4 సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి ఎంపీడిఓలను ఆదేశించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పి4 సర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిపిఓ వేణుగోపాల్, డిఎల్డిఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 19, 2025 / 07:08 PM IST

‘బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’

NRML: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించు వివిధ రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు అందించు రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు.

February 19, 2025 / 07:03 PM IST

నరేందర్ రెడ్డిని గెలిపించాలి: ఆడే గజేందర్

ADB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే గజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.

February 19, 2025 / 06:56 PM IST

కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వర్షిత

NLG: పెద్దవూర మండలం వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆడెపు వర్షిత, ఈనెల 9న నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో జరిగిన సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్ జరుగు పోటీలలో జిల్లా తరపున పాల్గొననున్నట్లు ఇవాళ పాఠశాల PD లెనిన్ తెలిపారు.

February 19, 2025 / 06:55 PM IST

ఉద్యాన నర్సరీ సందర్శించిన విద్యార్థులు

ADB: జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఉజ్వల భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాలలు కార్యక్రమంలో భాగంగా అధికారులు విద్యార్థుల కోసం క్షేత్ర పర్యటనలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఇవాళ గుడిహత్నూర్ ప్రభుత్వ మోడల్ స్కూల్, ఉన్నత పాఠశాల, యాపాల్ గూడ విద్యార్థులు ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన నర్సరీని సందర్శించారు.

February 19, 2025 / 06:50 PM IST

‘ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి’

ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అదిలాబాద్ ఎంపీ జి.నగేష్ కోరారు. ఇవాళ జన్నారం మండల కేంద్రంలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్యలను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామనాథ్, మండల అధ్యక్షులు మధుసూదన్ ఉన్నారు.

February 19, 2025 / 06:47 PM IST

ఉరివేసుకుని 8వ తరగతి బాలిక ఆత్మహత్య

SKLM: మందస మండలం లోహరిబంధ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం అనంతరం సమీపంలో ఉన్న జీడీ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 19, 2025 / 06:26 PM IST

‘ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలి’

VSP: NTR కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.

February 19, 2025 / 05:35 PM IST

‘విద్యార్థులకు ప్లేట్లు అందజేత’

ADB: బేల మండలంలోని కరోని (బి) గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులకు ప్లేట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి విద్యార్థులకు ప్లేట్లను ఇవాళ అందజేశారు. ప్రైమరీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

February 19, 2025 / 05:30 PM IST

పన్ను వసూలు 100% పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

NRML: పన్ను వసూలు వంద శాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఇవాళ నిర్మల్ పట్టణంలో వివిధ కాలనీలలో జరుగుతున్న పన్నుల వసూలు, వాణిజ్య లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో పనులు చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 19, 2025 / 05:21 PM IST

CHAMPIONS TROPHY: తొలి సెంచరీ చేసిన విల్‌యంగా

కరాచీ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో కివిస్ ఓపెనర్ విల్‌యంగా సత్తా చాటాడు. 107 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో ఒక సిక్స్, 11 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్‌లో అతడికిది నాలుగో సెంచరీ. క్రీజులో ఉన్న మరో కివిస్ ఆటగాడు లేథమ్ కూడా అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కివిస్ స్కోర్ 34.3 ఓవర్లలో 173/3

February 19, 2025 / 05:19 PM IST

‘బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రాకపోకలు నిషేధం’

KKD: గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పుష్కర – పోలవరం కాలువ గట్టుపై ఉన్న కోళ్ల ఫారంలో మరో 2500 కోళ్లు మంగళవారం మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్కఫారంలోనే 6వేల కోళ్లు చనిపోయాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా గోతులు తీసి ఖననం చేశారు. బర్డ్ ఫ్లూ అనుమానిత కోళ్లు ఖననం చేసిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ప్రజలు, వాహన రాకపోకలు నిషేధమంటూ ఫ్లెక్సీలు పెట్టారు.

February 19, 2025 / 05:15 PM IST

‘నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలే’

KKD: మహాశివరాత్రి ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రంలో బుధవారం ఈవో బల్ల నీలకంఠం అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

February 19, 2025 / 05:07 PM IST

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

CTR: పుంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్‌లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, పెద్దలు, మహిళలు జై భవాని, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 19, 2025 / 05:01 PM IST