RR: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు ప్రభుత్వం నిర్ణయించిన స్టైఫండ్ను ఇవ్వకుండా యాజమాన్యాలు మోసం చేస్తున్నాయని విద్యార్థి, యువజన సంఘాలు ఆరోపించాయి. ఈ దోపిడీని అరికట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు నిన్న వినతి పత్రం సమర్పించారు.
KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో రుక్మాపూర్, కాట్నపల్లి గ్రామాల్లో వారం రోజులుగా సాగిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు గురువారంతో ముగిశాయి. ముగింపు వేడుకలో వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య మాట్లాడుతూ.. శిబిరాల ద్వారా విద్యార్థుల్లో సేవా భావం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పేర్కొన్నారు. వాలంటీర్లు చేపట్టిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
SKLM: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని లావేరు పోలీసులు అరెస్ట్ చేశారు. లావేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న అబ్దుల్ రవూఫ్ను తనిఖీ చేయగా, అతని నుంచి 7.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అవతారం గురువారం సాయంత్రం తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.
ATP: శెట్టూరు మండలం తిప్పనపల్లిలో 2022లో జరిగిన బాలుడి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భూ తగాదాల నేపథ్యంలో విష్ణువర్ధన్ అనే 11 ఏళ్ల బాలుడిని చిత్తప్ప, ఈరన్న, మురుకుందప్ప కలిసి హత్య చేశారు. కేసును విచారించిన జిల్లా జడ్జి భీమారావు నిందితులకు జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పు ఇచ్చారు.
VZM: బొబ్బిలి సీఐ కె. నారాయణరావు గురువారం రాత్రి స్దానిక అలజంగి గ్రామంలో పల్లెనిద్ర చేశారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు. రానున్న స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. గ్రామస్తులతో మమేకమైన ఆయన పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఐ కొండలరావు ఉన్నారు.
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో ఇవాళ పర్యటించనున్నారు. తుంబూరులో తారురోడ్డు ప్రారంభోత్సవం, నారాయణవనంలో క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ కార్యక్రమం, పిచ్చాటూరులో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నాగలాపురంలో ‘అన్నదాత సుఖీభవ’ మెగా చెక్కు పంపిణీ చేసి, వెంబాకంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
AKP: అచ్యుతాపురం మండలం చోడపల్లిలో వేంచేసియున్న చోడమాంబ అమ్మవారి పండగను ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ధర్మకర్త నాగేశ్వరరావు గురువారం తెలిపారు. పండగలో భాగంగా ఈనెల 23న అమ్మవారి పుట్టుక ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13న కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఎస్ఆర్ శంకరన్ హాల్లో జరిగే ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు హాజరుకావాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్షి కోరారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.
సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సుబ్బారాయునిపల్లి గ్రామంలో గురువారం రాత్రి నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ విజయ్ కుమార్ గ్రామ ప్రజలకు ఆస్తి నేరాలు, సైబర్ మోసాలు, అక్రమ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, అనుమానిత వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని కోరారు.
CTR: గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరికి మన థామస్’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ నిన్న పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ అర్జీలు స్వీకరించారు. అనంతరం అదే గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు.
ADB: ప్రజలందరూ పండుగలను శాంతి సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గురువారం బోథ్ మండలంలోని జామ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, ఐక్యంగా జీవించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
VZM: రేగిడి MPDO కార్యాలయంలో శుక్రవారం జరుగనున్న ప్రజా దర్చార్ను సద్వినియోగం చేసుకోవాలని స్దానిక MPDO శ్యామల కుమారి సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రజా దర్చార్కు MLA కొండ్రు మురళీమోహన్ రానున్నారని, ఉదయం10 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తామన్నారు. 39 గ్రామపంచాయతీ, 51 రెవెన్యూ గ్రామాలు, 25 సచివాలయాల పరిధిలో గ్రామాల ప్రజల సమస్యలు అర్జీలు అందజేయవచ్చన్నారు.
AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆయా శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. ఈ మేరకు ఇవాళ అన్ని విభాగాధిపతులతో భేటీ నిర్వహించనుంది. ఆ తర్వాత ఖాళీలపై తుది జాబితాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం టి.చల్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో కొత్త 11KV ఫీడర్ అభివృద్ధి పనుల వల్ల శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అమలాపురం ఈఈ కె.రాంబాబు తెలిపారు. టి. చల్లపల్లి, గోపవరం, సరిపల్లి, ఎస్.యానం, వాసాలతిప్ప, నక్కరామేశ్వరం గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కరెంటు ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
E.G: ధవలేశ్వరం PS పరిధిలోని టిడ్కో ఇళ్ల వద్ద గురువారం రాత్రి CI టి. గణేశ్ సిబ్బందితో కలిసి ‘పల్లెనిద్ర’ నిర్వహించారు. వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని సీఐ పేర్కొన్నారు.