ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద 172.310 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ పీ.వెంకటరమణ బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ఎస్సై పీ.కిషోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా, ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ మేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
KMM: పోలీస్ శాఖలో 9 ఏళ్లుగా విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి (ఫిమేల్ డాగ్) అనారోగ్యంతో మృతి చెందింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. యామి (జాగిలం) లబ్రాడార్ రిట్రీవర్ సంతతికి చెందింది.
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. RR 19.2 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో GTకి ఈ విజయం దక్కింది. ప్రసిద్ధ్ 3 వికెట్లు పడగొట్టాడు. కిశోర్, రషీద్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్, కుల్వంత్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటర్లలో హిట్మెయిర్(52), సంజూ(41) రాణించిన ఫలితం దక్కలేదు.
చైనా మినహా మిగతా దేశాలకు ట్రంప్ సుంకాల నుంచి ఊరట లభించింది. మిగతా దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు చైనాపై టారిఫ్ను 125 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. కాగా అమెరికా వస్తువులపై చైనా 84శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే.
HYD: తాగునీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని, మోటార్ను సీజ్ చేయడంతోపాటు నీటి కనెక్షన్ కట్ చేస్తామని జలమండలి ఎండీ హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.
బిహార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగు జిల్లాల పరిధిలో పిడుగుల వర్షం పడింది. ఈ ఘటనలో బెగూసరాయ్, దర్బంగా జిల్లాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. తుఫాను, వర్షం, ఈదరుగాలులతో కూడిన వర్షంలో పిడుగులు పడటంతో మొత్తం 13 మంది మృతి చెందినట్లు సమాచారం.
ELR: ముదినేపల్లి మండలం వడాలిలో అనుమానాస్పదస్థితిలో వివాహిత తనుశ్రీ మృతి చెందిన సంఘటనలో ఆమె భర్త బెజవాడ అనిల్ కుమార్ను బుధవారం డీఎస్పీ శ్రావణ కుమార్ను అరెస్టు చేశారు. సోమవారం తనుశ్రీ భర్త వేధింపులు తట్టుకోలేక మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కైకలూరు న్యాయస్థానానికి తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
KKD: జగ్గంపేట మండలం రాజపూడి, గోవిందపురం, వెంగయమ్మపురం, మల్లిసాల గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై రూ. 90 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అలాగే గోకులం షెడ్డును కూడా ప్రారంభించారు.
PPM: కురుపాం మండలం గిరి శిఖర ప్రాంతాలలో ఈనెల 11న శుక్రవారం గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పర్యటించనున్నారని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. రాముడుగూడ, కీడవాయి గ్రామాలకు రూ.2.90 కోట్ల NREGS నిధులతో పూర్తైన బీటీ రోడ్లను ప్రారంభిస్తారన్నారు. దీనిని కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ గమనించాలన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయనే పక్కా సమాచారం మేరకు బుధవారం ట్రాన్స్పోర్ట్ దుకాణాలపై దాడులు చేసి 45 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ CI రాణ ప్రతాప్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.1,57,500 ఉంటుందని సీజ్ చేసిన విత్తనాలు కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు.
KKD: దివ్యాంగులను సానుభూతితో గాకుండా మానవత్వంతో చూడాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. బుధవారం కరప మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. వారికిస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ అనుపమ, ఎంఈఓలు కృష్ణవేణి, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
KMR: కల్లు దుకాణాల్లో ఇకనుంచి విధిగా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని ఎస్సై అనిల్ అన్నారు. బుధవారం మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కల్లు దుకాణం దారులను, డిపో వారిని పిలిపించి ఎస్సై సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసారు. చిన్నపిల్లలను, మైనర్లను కల్లు కాంపౌండ్ లోనికి రానివ్వకూడదని హెచ్చరించారు.
NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నర్రా రాఘవరెడ్డి పేరున కవి ఏబూషి నర్సింహా రాసిన పాటల సీడీని బుధవారం ఆవిష్కరించిన సభలో సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జన హృదయ నేతగానే కాకుండా ప్రజా కళాకారుడిగా ప్రజల సమస్యల పరిష్కారానికి జీవితం అంతా కృషి చేసిన కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి సేవలు మరువలేనివి అని అన్నారు.
ATP: శింగనమలలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం కుటుంబ పోషణలో మహిళల పాత్ర చాలా కీలకంగా మారిందని అన్నారు. శింగనమల నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం తరఫున 500 కుట్టుమిషన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
CTR: ఒంటిమిట్ట కోదండ శ్రీరాములస్వామి వారిని ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. అయనతోపాటు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి తదితరులు ఉన్నారు.