అన్నమయ్య: బస్సులను రోడ్డుపైకి తీసుకువెళ్లి ప్రతిరోజు కండిషన్ చెక్ చేయాలని మెకానిక్, డ్రైవర్లకు మదనపల్లె ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం బస్సుల కండిషన్లపై వారిని ఆరా తీసి బస్సులను పరిశీలించారు. అందులో భాగంగా స్టీరింగ్, బ్రేక్, బ్యాటరీ, ఎలక్ట్రికల్ వైరింగ్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
బాపట్ల: మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రాజవెంకటాద్రి మంగళవారం తీర్పు ఇచ్చారు. కాగా, రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు.
KKD: పెద్దాపురంలో లలిత ఇండస్ట్రీస్లో జట్టు కార్మికుడు మంగళవారం స్నానం చేస్తూ బాత్ రూంలో మృతి చెందాడు. మృతుడు బిహార్ షబ్బీర్ ఆలం(34)గా గుర్తించారు. పచ్చకామర్లతో అనారోగ్యంగా ఉన్నాడని తోటి కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పెద్దాపురం పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMM: అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు
NGKL: మానవ అక్రమ రవాణా నివారణ పై అవగాహనలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అండ్ లేబర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్ను ఉప్పునుంతల తహశీల్దార్ ప్రమీల మంగళవారం ఆవిష్కరించారు. వెట్టిచాకిరీ, ఇతర ఇబ్బందికర పనుల కోసం మనుషులను ఉపయోగిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.
NGKL: తాడూర్ మండలంలోని ఐతోల్ గ్రామంలో నేడు ఛత్రపతి శివాజి మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ పాల్గొంటారని అన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
ASR: హుకుంపేట మండలం తీగలవలస పంచాయితీలోని బసలబంద గ్రామంలో మంగళవారం త్రాగునీటి బోరుకు సర్పంచ్ బేసు శంకుస్ధాపన చేశారు. గ్రామానికి త్రాగునీరు అందించుటకు పంచాయితీ మరియు జల్ జీవన్ మిషన్ పథక నిధుల నుండి సుమారు రూ.6 లక్షలు మంజూరు అయినట్లు ఇంజనీరు జె చందు తెలిపారు.
W.G: రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకు ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మొగల్తూరు మండలం కె.పి పాలెం గ్రామంలో జరుగుచున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను జేసీ సరిహద్దుల మ్యాప్లను పరిశీలించారు.
VZM: జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలన్నారు. అంతకుముందు అంగన్వాడీ కార్యకర్తల ఆరు రోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు అందజేశారు.
ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మిలో జరిగిన దాడి కేసులో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. గ్రామానికి చెందిన వెంగల్ రెడ్డి, శబరి కంఠారెడ్డి పై ఈనెల 13న వల్లెం రాజశేఖర్ రెడ్డి, అతని భార్య రాజ్యలక్ష్మి దాడి చేశారన్నారు. మెజిస్ట్రేట్ ముందు ఇద్దరినీ హాజరు పరచగా కనిగిరి జడ్జి భరత్ చంద్ర ముద్దాయిలిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు.
వనపర్తి: జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా నిరంతర విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఎవరైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 హెల్ లైన్కు ఫోన్ చేయాలన్నారు.
SKLM: ఆక్వాకల్చర్ టెక్ 2.0 కాంక్లేవ్ కార్యక్రమం రెండు రోజుల పాటు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంగళవారం ఉదయం టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కె.అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్వా రంగం సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఆక్వా ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
VZM: గ్రామాలలో సేకరించిన చెత్తను ఎస్డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు సూచించారు. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలోని ఎస్డబ్ల్యూబీసీ కేంద్రాన్ని డీపీఈఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ బిఎస్ఎన్ పట్నాయక్తో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. తడిపొడి చెత్తను వేరు చేసి ఎస్డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని క్లాప్ మిత్రలకు సూచించారు.
NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా వీరులపాడు మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్గా శిక్షణ పొందిన 8 మంది మంగళవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా NIRD PR కో-ఆర్డినేటర్ జీవీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.