• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నల్ల బ్యాడ్జీలు ధరించి పోస్టల్ ఉద్యోగుల ధర్నా

SRD: పోస్టల్ యాక్ట్ – 2023 అమలు చేయవద్దని కోరుతూ తపాలా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోస్టల్ శాఖను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

February 18, 2025 / 07:53 PM IST

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

నారాయణపేట: నారయణపేట మండలం అప్పంపల్లి మెడికల్ కళాశాల వద్ద ఈనెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో మంగళవారం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పరిశీలించారు. సభ స్థలం, వేదిక, పార్కింగ్ స్థలాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.

February 18, 2025 / 07:19 PM IST

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: గొల్లపూడిలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు ఎన్నికల ప్రచారంలో మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పట్టభద్రుల ఓట్లను అభ్యర్థించారు.

February 18, 2025 / 07:10 PM IST

అథ్లెటిక్స్‌లో జిల్లా విద్యార్థికి బంగారు పతకం

నాగర్ కర్నూల్: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన పి అభిషేక్ అండర్-20 ట్రిపుల్ జంప్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అతని విజయాన్ని అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ స్వాములు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.

February 18, 2025 / 06:40 PM IST

జగన్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు: బెజవాడ నజీర్

కృష్ణా: జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని టీడీపీ నేత బెజవాడ నజీర్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనతో విసిగిపోయిన జనం వైసీపీని గద్దె దించినా జగన్‌‌కు బుద్ది రాలేదని, పోలీస్ అధికారులను, టీడీపీ నేతలను బట్టలు ఊడదీసి నిలబెడతానని హెచ్చరించే విధానం చూస్తే మానసిక రుగ్మతతో బాధపడుతునట్లు స్పష్టమైందన్నారు.

February 18, 2025 / 06:39 PM IST

కల్తీ నెయ్యి కేసు.. ముగిసిన విచారణ

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది. తిరుపతి సిట్ కార్యాలయంలో ఐదు రోజులపాటు నిందితులను విచారించారు. సిట్ అధికారులు కస్టడీలో వివిధ అంశాలపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీవైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్డాను‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు.

February 18, 2025 / 05:25 PM IST

BRS పాలనలో అవమానాలు ఎదుర్కొన్నా: జూపల్లి

TG: గత BRS పాలనలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ చెప్పిన హామీలు నిరుద్యోగ భృతి, దళితులకు భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల అవినీతిపై తాను సవాల్ చేస్తే స్పందించలేదని అన్నారు. గత 10 ఏళ్ల పాలన వల్ల నెలకు రూ.6,500 కోట్లు వడ్డీలు కడుతున్నామన్నారు.

February 18, 2025 / 05:21 PM IST

శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యేలు

W.G: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగాలని ఆకాంక్షించారు.

February 18, 2025 / 05:17 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ

ATP: ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం ఎస్పీ జగదీశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రతిష్ఠ గురించి అడిగి తెలుసుకున్నారు.

February 18, 2025 / 05:09 PM IST

నేటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు ఇవాళ వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181.9292 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కుడి కాల్వకు 10000 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8718 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

February 18, 2025 / 04:42 PM IST

జడ్పీ హై స్కూల్లో యానివర్సరీ స్పోర్ట్స్ మీట్

కృష్ణా: పామర్రు జడ్పీ హై స్కూల్లో యానివర్సరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎంఈఓ పద్మారాణి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రాణి మాట్లాడుతూ.. స్కూల్ యానివర్సరీ స్పోర్ట్స్ మీట్‌ను చేపట్టి, పలు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు రవికిషోర్, మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

February 18, 2025 / 03:21 PM IST

ALERT: రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దు

TG: పట్టభద్రల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయం తెలియక చాలామంది సాధారణ రోజుల మాదిరిగా నగదుతో ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణిస్తే తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు సూచిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

February 18, 2025 / 02:25 PM IST

‘అధికారంలోకి రాగానే పోలీసుల బట్టలూడదీస్తాం’

AP: సీఎం చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘మేము అధికారంలోకి వచ్చాక TDPకి సెల్యూట్ చేసిన పోలీసుల బట్టలూడదీస్తాం. వంశీ అరెస్ట్ సమయంలో ఏడాదిలో రిటైర్ అవుతున్నానంటూ ఓ సీఐ దురుసుగా ప్రవర్తించారు. అధికారంలోకి వచ్చాక.. రిటైర్ అయినా సరే.. బట్టలూడదీస్తాం. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని పోలీసులకు సూచిస్తున్నా’ అని తెలిపారు.

February 18, 2025 / 02:23 PM IST

‘ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’

SS: పెనుకొండలో ఆటో కార్మికులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ పోర్టు రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ప్రైవేట్ పరంచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

February 18, 2025 / 02:23 PM IST

కోస్టారికాకు అక్రమ వలసదారుల తరలింపు

అక్రమ వలసదారులను అమెరికా నుంచి తమ దేశానికి పంపుతున్నట్లు కోస్టారికా ప్రకటించింది. 200 మంది వలసదారులతో కూడిన విమానం రేపు తమ దేశానికి చేరుతుందని చెప్పింది. అందులో మధ్య ఆసియా, ఇండియాకు చెందినవారు ఉన్నారని పేర్కొంది. వారిని పనామా సమీపంలోని తాత్కాలిక వలసదారుల శిబిరానికి తరలించనున్నారు. అక్కడి నుంచి భారత్‌కు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తానికి అమెరికానే డబ్బు చెల్లిస్తుంది.

February 18, 2025 / 02:18 PM IST