VZM: కొత్తవలస ప్రియదర్శిని గ్యాస్ ఏజెన్సీని తహసీల్దార్ రమాలక్ష్మి, పౌర సరఫరాల అధికారితో కలిసి శుక్రవారం తనిఖీలు చేశారు. గ్యాస్ పై వస్తున్న వదంతులు నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎటువంటి గ్యాస్ కొరత లేదని చెప్పారు. వినియోగదారులు ఆందోళన చెందన అవసరం లేదన్నారు. ఓటీపి ప్రకారం సిలిండర్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
AP: అమరావతిలో బిట్స్ పిలానీ నిర్మాణ ప్లాన్లను మంత్రి లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేష్కు క్యాంపస్ ప్లాన్లను ఆ సంస్థ ప్రతినిధులు చూపించారు. క్యాంపస్లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కోర్సులు ఉంటాయని తెలిపారు. రెండు దశల్లో 7వేల మందికి అవకాశం కల్పించేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని వివరించారు.
BHPL: గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయాన్ని ఇటీవల నూతన SIగా బాధ్యతలు చేపట్టిన శుక్రవారం అశోక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా SI స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు SIను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
PLD: వినుకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన పీ-4 నూతన కార్యాలయాన్ని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు.
NGKL: రైతుల ఖాతాల్లోకి PM కిసాన్ 22వ విడత నిధులు జమ చేయడంపై కల్వకుర్తి బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో మండల బీజేపీ అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, మహిళలు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం పనిచేస్తోందని వారు కొనియాడారు.
SRD: సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన శ్రీజ అనే అమ్మాయి పెళ్లి కోసం అవసరమయ్యే పుస్తే, మట్టెలను ఖేడ్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పరమేశ్వర్, రాజ్ కుమార్ సభ్యులు ఉన్నారు.
NRML: కడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కడెం తహశీల్దార్ లచ్చిరాం, విద్యాధికారి షేక్ హుస్సేన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాధికారి షేక్ హుస్సేన్ తెలిపారు.
MBNR: మిడ్జిల్ మండలంలోని కొత్తూరు, మిడ్జిల్ శివార్లలో ఇటీవల చోరీకి గురైన రెండు ట్రాక్టర్లను ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు బృందం రికవరీ చేసింది. నిఘా పెట్టిన పోలీసులు కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వీటిని స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై టీంను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ ప్రత్యేకంగా అభినందించారు.
SRCL: జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం 34 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం తెలిపారు. మొత్తం 7,317 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 3,511 మంది బాలురు, 3,806 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ ట్రస్ట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. టీబీ నుంచి కోలుకున్న వారికి హెల్త్ కిట్లు అందజేశారు.
GDWL: ధరూర్ మండలంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఉప్పెర్, మార్లబీడు, ధరూర్ పరీక్షా కేంద్రాలను ఎంఈవో రవీంద్రబాబు శుక్రవారం సందర్శించారు. పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆయన తెలిపారు. పారదర్శకత కోసం ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
MBNR: నవాబుపేట మండలం లోకిరేవులో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 75 గజాల స్థలం ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్తో చర్చించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
GNTR: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చారు.
రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాక్టెయిల్ 2’ విడుదల తేదీ ఖరారైంది. హోమీ అదజానియా తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2026, జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 18న ఈ మూవీ ఫస్ట్ లుక్ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత విడుదల కానున్న ఆమె తొలి సినిమా ఇదే. ఇందులో షాహిద్ కపూర్, కృతి సనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
AP: చీడికాడ బీసీ హాస్టల్లో ఆహార కొరత విషయంపై మంత్రి సవిత స్పందించారు. ప్రస్తుతం ప్రభుత్వ భవనంలో మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తరచుగా హాజరు కాకపోవడమూ ఇందుకు కారణమని పేర్కొన్నారు. సిబ్బంది విద్యార్థినుల పట్ల సరైన శ్రద్ధ చూపట్లేదని గుర్తించామన్నారు. పాత సిబ్బందిని పూర్తిగా మార్చి.. వారిపై చర్యలకు ప్రతిపాదించినట్లు తెలిపారు.