• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘గ్యాస్ డెలివరీలో జాప్యం జరిగితే ఫిర్యాదు చేయండి’

MDK: గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజులలోపు సిలిండర్ డెలివరీ కావాలని, జాప్యం జరిగితే ఫిర్యాదు చేయాలని రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు సూచించారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ హక్కులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కొందరు కావాలని గ్యాస్ షార్టేజ్ సృష్టిస్తున్నారన్నారు.

March 13, 2026 / 03:03 PM IST

రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చు: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హరిత అధికారికంగా ప్రారంభించారు. కలెక్టరేట్ ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాల ప్రతినిధులు రక్తదానం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మీరు చేసే రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని ఆమె పేర్కొన్నారు.

March 13, 2026 / 03:03 PM IST

IPL: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ల్లో ‘ABD’ టాప్

IPL చరిత్రలో అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో 25 అవార్డులతో ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (21), విరాట్ కోహ్లీ (19), డేవిడ్ వార్నర్ (18), MS ధోనీ (18) నిలిచారు. వీరంతా అసాధారణ ప్రదర్శనలతో ఎన్నోసార్లు తమ జట్లకు ఒంటిచేత్తో విజయాలను అందించి, IPL చరిత్రలో చెరగని ముద్ర వేశారు.

March 13, 2026 / 03:03 PM IST

సీఎం కార్యక్రమానికి ఉంగుటూరు నుంచి బయలుదేరిన రైతులు

కృష్ణా: సూరంపల్లిలో జరిగే ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి హాజరుకావడానికి ఉంగుటూరు గ్రామం నుంచి టీడీపీ కార్యకర్తలు, రైతులు భారీగా శుక్రవారం బయలుదేరారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని వారు సమూహాలుగా వెళ్లారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు తెలపడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.

March 13, 2026 / 03:02 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సరికొత్త రికార్డు

మార్చి 19న రిలీజ్ కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. HYDలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘డాల్బీ సినిమా’ స్క్రీన్‌పై ప్రదర్శితం కానున్న తొలి తెలుగు మూవీగా చరిత్ర సృష్టించనుంది. అద్భుతమైన విజువల్స్, సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.

March 13, 2026 / 03:01 PM IST

మొల్లమాంబ జయంతి సందర్భంగా నివాళులు

ప్రకాశం: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి మరియు సిబ్బంది మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు. ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం పొందిందని కొనియాడారు.

March 13, 2026 / 03:00 PM IST

కొత్తవలసలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ

VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న టీ కొట్టులో తహసీల్దార్ చిరంజీవి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మూడు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, స్థానిక గ్యాస్ ఏజెన్సీస్‌కి తరలించారు. ఆనంతరం అతనిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకోసారి పట్టుబడితే సిలిండర్లు రద్దు చేస్తామన్నారు.

March 13, 2026 / 03:00 PM IST

తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్లు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం చెప్పింది. జల్‌జీవన్ మిషన్ ద్వారా నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. FRA పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది.

March 13, 2026 / 02:59 PM IST

భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,362.48 పాయింట్లు కోల్పోయి 74671.94 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 456.35 పాయింట్ల నష్టంతో 23182.80 దగ్గర కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.

March 13, 2026 / 02:58 PM IST

పచ్చర్లలో పశువులకు గాలికుంటు టీకాలు

GDWL: రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో పశు వైద్యాధికారిణి డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో 68 పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. గిట్టలు చెడిపోవడం, నోటి పుండ్లు, నీరసం వంటి లక్షణాల నివారణకు ఈ టీకాలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ పాలాగు, గోపాలమిత్ర భాస్కర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:57 PM IST

గిరిజనుల ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీక

BDK: బూర్గంపాడు మండలం సందేల్ల రామాపురం గ్రామంలో శుక్రవారం సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజనుల ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన గొప్ప పండగ అని తెలిపారు.

March 13, 2026 / 02:54 PM IST

ఆరేళ్ల తర్వాత చైనాకు ఉత్తర కొరియా రైలు

ఆరేళ్ల విరామం తర్వాత ఉత్తర కొరియా ప్యాసింజర్ రైలు తొలిసారిగా చైనా రాజధాని బీజింగ్ చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపడనున్నాయి. బీజింగ్, ప్యోంగ్యాంగ్ మధ్య వారానికి నాలుగు సార్లు ఈ రైలు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఇది సరిహద్దు ప్రయాణాల్లో కీలక మార్పుగా అభివర్ణించారు.

March 13, 2026 / 02:53 PM IST

చిత్తూరు ఆసుపత్రిలో ప్రమాదం.. కారణం ఇదే!

చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నిరుపయోగంగా ఉన్న 6 అంబులెన్సులను అపోలో సంస్థ స్క్రాప్‌కి అప్పగించింది. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అంబులెన్సును విడిభాగాలుగా కట్ చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనాలు కాలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

March 13, 2026 / 02:53 PM IST

‘అరైవ్-అలైవ్‌’పై షార్ట్ ఫిల్మ్ పోటీలు

TG: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ఓపెన్ రోడ్ సేఫ్టీ షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ మేకింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈనెల 31 వరకు 30-90 సెకన్ల వీడియోను తమకు పంపించాలని కోరారు. ఈ పోటీల్లో ఫిల్మ్ మేకర్లు, డైరెక్టర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు, విద్యార్థులు పాల్గొనవచ్చు.

March 13, 2026 / 02:51 PM IST

‘వృషకర్మ’ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

‘తండేల్‌’ తర్వాత నాగచైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ.45 కోట్లకు దక్కించుకోగా, ఓవర్సీస్ రైట్స్ రూ.8 కోట్లకు అమ్ముడయ్యాయట. చైతూ కెరీర్‌లోనే ఇది అత్యధిక ఓవర్సీస్ బిజినెస్ కావడం విశేషం.

March 13, 2026 / 02:51 PM IST