NLR: తోటపల్లి గూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైప్ లైన్ నిర్మాణంతో పంట పొలాలు ధ్వంసం అయినట్లు స్థానికులు ఆదవేదన వ్యక్తం చేశారు. ఈ పొలాలను సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో ధ్వంసం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కోతలు పూర్తయ్య వరకు పనులు నిలిపివేయాలని MLA నిర్వాహకులను కోరారు.
NLR: మద్దతు ధర కోల్పోయిన రైతులకు, ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ నర్సోజికి వినతిపత్రం సమర్పించారు. మద్దతు ధర లేక రైతులు తమ పంటలను నష్టానికి అమ్ముకుంటున్నారని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.
ఎక్కువ టూత్ పెస్ట్ పెట్టుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ పేస్టు అధికంగా వాడితే.. రోగాల బారిన పడుతారని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఉపయోగిస్తే దంతాలపై క్యావిటీస్ ఏర్పడుతాయి. పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
KRNL: డీఈవో శ్యామ్యూల్ పాల్ను చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో జరిగిన ప్రజా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కొంత మంది ఉపాధ్యాయులను డిప్టేషన్ల పేరుతో జిల్లా కార్యాలయానికి తిప్పుకుంటున్నారని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల విధులకు డుమ్మా కొడుతున్నారన్నారు.
NDL: శ్రీశైల భ్రమరాంబ దేవికి కృష్ణా జిల్లాకు చెందిన ఎం.రామచంద్రరావు కుటుంబసభ్యులు బంగారుపూత కలిగిన మకరతోరణాన్ని సమర్పించారు. 250 గ్రాముల బరువుగల ఈ మకరతోరణం విలువ సుమారు రూ. 24,45,000/- అని దాతలు పేర్కొన్నారు. మకరతోరణాన్ని దాతలు ఆలయ అధికారులకు నేరుగా అందజేశారు. దాత కుటుంబాన్ని స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
ATP: పామిడిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
PLD: నటుడు శివాజీ ఆసక్తి ఉన్న యువతను సినీరంగంలో ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నటుడు శివాజీ స్వగ్రామం గొరిజవోలులో శివాజీ ప్రొడక్షన్స్-2 బ్యానర్ పై నిర్మిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో వారంపాటు జరిగే చిత్రీకరణకు తగిన సహాయసహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.
ATP: పౌర సరఫరాల గోదాములో స్టాక్ వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను గోదాము ఇంచార్జ్ ఎప్పటికప్పుడు నవికరుస్తూ ఉండాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సిబ్బందికి ఆదేశించారు. సోమవారం రాయదుర్గం పట్టణ కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
BHNG: మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న షటిల్ టోర్నమెంట్స్ క్రీడా పోటీలను ఎస్సై డీ.నాగరాజు, ఎంఈఓ తీపి రెడ్డి గోపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎస్సై, ఎంఈఓ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, లభిస్తుందని యువకులు క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.
CTR: పుత్తూరు మున్సిపాలిటీ తిమ్మాపురం శ్రీశ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో సోమవారం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హాజరయ్యారు. ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ATP: కార్మికులకు మున్సిపల్ శాఖనే వేతనాలు చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు గత సమ్మె హామీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామికి వినతి పత్రం అందజేశారు.
CTR: కుప్పం మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిరు వ్యాపారుడు వేలు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి చిరు వ్యాపారం సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో సోమవారం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. వేలు అనారోగ్యంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా చిరు వ్యాపారుల సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
PLD: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను గెలిపించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పిలుపునిచ్చారు. అమరావతి మండలం లేమల్లే, పెదకూరపాడు మండల బలుసుపాడులో సోమవారం పట్టభద్రులను గ్రాడ్యుయేట్లును ఓట్లు అభ్యర్థించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆలపాటి కృషి చేస్తానని పేర్కొన్నారు.
CTR: పలమనేరు రూరల్ మండల పరిధిలోని కొలమాసనపల్లి గొల్లపల్లిలో నిర్వహిస్తున్న గంగ జాతరకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సోమవారం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచ్ వెంకటరత్నం, సెల్వరాజ్, తదితరులు ఉన్నారు.