SKLM: రాష్ట్ర సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారా ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు అందరి సహకారం ఉండాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. DRDA కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతాంగానికి అలాగే మత్స్యకారులను చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
PPM: ప్రతీ కుటుంబం కనీసం లక్ష రూపాయలు ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుండి జీవనోపాధి కల్పనలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం కనీసం లక్ష ఆదాయం సంపాదించాలని, ఇందుకు వ్యవసాయ, వాణిజ్య యూనిట్లు కార్యాచరణ తయారు చేయాలన్నారు.
PLD: నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో హెచ్డీఎస్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆసుపత్రిని మెడికల్ కళాశాలగా అభివృద్ధి చేస్తామని వారు హామీ ఇచ్చారు. నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, వైద్య సేవలు మెరుగుపరచాలని సూచించారు.
SRD: జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
SRPT: తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా నరసింహారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
BPT: గత వైకాపా పాలనలో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసి, పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ATP: సమాజసేవ కంటే మించింది మరొకటి లేదని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గంలోని MPDO కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యావ్యవస్థ పునర్నిర్మాణంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఎంతో ఉందన్నారు. అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు.
E.G: గత YCP ప్రభుత్వం ఐదేళ్లపాటు రాష్ట్రంలో అరాచక పాలన సాగించి, అభివృద్ధిని విచ్ఛిన్నం చేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. గురువరం బొమ్మూరులో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. YCP నిరంకుశ విధానాల వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందన్నారు.
NLG: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు.
SRD: కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ MRO జుబేర్ బదిలీ అయ్యారు. అయితే గురువారం స్థానిక కార్యాలయంలో MRO భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీ ఓ.సుభాష్, కార్యాలయం అధికారులు, సిబ్బంది కలిసి ఆత్మీయ సన్మానం చేశారు. గత కొన్నేళ్ల నుండి బాధ్యతతో విధులు నిర్వహించిన డిప్యూటీ MRO జుబేర్ సేవలను అధికారులు కొనియాడారు. అనంతరం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ATP: గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామంలో కురిసిన వర్షానికి పిడుగుపాటుతో చిదంబరయ్య అనే రైతుకు చెందిన పది గొర్రెలు మృతి చెందాయి. బాధిత రైతు మాట్లాడుతూ.. గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని పిడుగుపాటుకు పది గొర్రెలు మృతి చెందాయని కన్నీరుమున్నీరయ్యాడు.
MDK: మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి ప్యాడి క్లీనింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఆర్డీవోలు పాల్గొన్నారు.
TG: పోషకాహార రాష్ట్రం లక్ష్యంగా పని చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగులు ఇస్తామని మంచి గ్రేడ్లు సాధించిన సెంటర్లకు, సిబ్బందికి, జిల్లా అధికారులకు అవార్డులు ఇస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కలకలలాడాలన్నారు.
స్టార్ హీరోయిన్ సమంత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో వివాహం చేసుకున్నాడు. అయితే సమంత కొంత కాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అతడితో త్వరలోనే మూడు ముళ్లు వేయించుకోనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.