TG: పోలీసు శాఖలో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సుమారు 17 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,369 మంది పోలీసులు పనిచేస్తుండగా, మంజూరైన పోస్టులు 95,361 ఉన్నాయి. ప్రతి ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికను పంపించినట్లు సమాచారం.
VKB: యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ అంగన్వాడీ టీచర్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వం పంపించే పోషక పదార్థాలు గర్భిణులు, బాలింతలకు పూర్తిగా ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపించారు. పదార్థాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో మండిపడుతున్నారు. అంగన్వాడీ టీచర్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ATP: కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో వచ్చే చింతపండు సీజన్ నాటికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని MLA అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు ఛైర్మన్తో కలిసి చింతపండు క్రయవిక్రయాలను ఆయన పరిశీలించారు. రైతులు, వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిల్వ సౌకర్యం లేక రంగు మారే ఇబ్బంది లేకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామన్నారు.
VZM: ఇసుక అక్రమ రవాణాపై బొబ్బిలి పోలీసులు, రెవెన్యూ అదికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. ఈ మేరకు స్దానిక వేగవతినది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో RI కొల్లి రాంకుమార్ దాడి చేసి 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వాకాలపై సమాచారం ముఖ్యమన్నారు.
NTR: తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 16వ తేదీ నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, తిరువూరు-5, గంపలగూడెం-5, విస్సన్నపేట-5, రెడ్డిగూడెం-2, ఏ కొండూరు-2 మండలాలు కలిపి 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలలో 3505 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బోర్డర్ 2’ OTT రిలీజ్ డేట్ ఖరారైంది. జనవరిలో విడుదలై విజయం సాధించిన ఈ దేశభక్తి మూవీ మార్చి 20 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. 1997 నాటి క్లాసిక్ ‘బోర్డర్’కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించాడు. యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్.
NLG: దేవరకొండలో ఏప్రిల్ 4న జరగనున్న INTUC సదస్సు కరపత్రాన్ని ఇవాళ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం INTUC నిరంతరం పోరాడుతుందని ఆయన కొనియాడారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడం కార్మికుల జీవన ప్రమాణాల పెంపుపై ఈ సదస్సులో చర్చిస్తామని తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
KRNL: కోడుమూరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హంద్రీనది ఒడ్డున ఉన్న వల్లెలాంబాదేవి ఆలయంలో ఈనెల 18 నుంచి 20 వరకు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. 18న గోపూజ, గణపతి పూజలు, 19న రథోత్సవం, 20న పారువేటతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభం ప్రభావంతో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.42కు చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో డాలర్కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా ఈ పతనానికి కారణమైంది.
AP: వేర్వేరు ప్రమాద ఘటనల్లో సీమకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు హైవే గోడ్డావుల కోట వల్ల బొలేరో వాహనాన్ని కారు ఢీకొనగా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అటు కర్ణాటక బళ్లారి సమీపంలో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు-కారు ఢీకొనగా.. కర్నూలు జిల్లా అదోనికి చెందిన అనురాగ్-ఐశ్వర్య దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TPT: చిన్నగొట్టిగల్లు మండలం రంగ స్వర్గరిగడ్డ గ్రామంలోని శ్రీ కోల్లాపురమ్మ ఆలయ ప్రాంగణంలో రేపు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
AP: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ఏడాది పొడవునా, 24 గంటలు దుకాణాలు తెరుచుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఉద్యోగుల సంక్షేమం కోసం వారానికి 48 గంటలు మాత్రమే పని చేయించాలని, ఒకరోజు సెలవు ఇవ్వాలని సూచించింది. పండుగ రోజుల్లో పని చేయిస్తే దానికి బదులుగా మరోరోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని తెలిపింది.
AP: CM చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 27 అంశాలపై చర్చ జరగనుండగా.. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. అలాగే CRDA ప్రాతిపాదనలను ఆమోదించడంతో పాటు పంచాయతీ రాజ్ పరిధిలోని APSIRDకి 5 ఎరాల భూకేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి MLA కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. దీంతో మాజీ MLA, స్టేషన్ ఘనపూర్ BRS ఇంచార్జ్ డాక్టర్ తాటికొండ రాజయ్య చిల్పూర్కు వెళ్తుండగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 14న చేపట్టనున్న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో భాగంగా KNR నుంచి కొండగట్టు వరకు సాగే 40 కి.మీ పాదయాత్రపై భానుడి ప్రతాపం, ట్రాఫిక్ చిక్కుల ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం, అదే రోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు సవాలుగా మారనున్నాయి.