NGKL: తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈ నెల 15 వరకు జరగనున్నాయని ఆలయ కార్యనిర్వాహకులు సూర్య ప్రకాష్ రావు తెలిపారు. 12న శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, 13న ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం, 14న సోమవారం బండ్ల ఊరేగింపు, 15న మంగళవారం ఉత్సవ మూర్తుల ఊరేగింపు, అమృత స్నానాలు నిర్వహించనున్నారు.
వనపర్తి: పెద్దమందడి గ్రామంలో గురువారం అప్పుల బాధతో జంగం చెన్నరాయుడు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. జంగం చెన్నరాయుడు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాడని, అయితే వాటిని తీర్చలేక మనస్తాపానికి గురైన ఆయన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య జంగం జయమ్మ తెలిపిందని ఎస్సై శివకుమార్ చెప్పారు.
HYD: తడి, పొడి చెత్త, హానికర చెత్తగా వేరు చేసి స్వచ్ఛ ఆటోలోకి ఇవ్వాలని ప్రజలకు కమీషనర్ శరత్ చంద్ర అవగాహన కల్పించారు. ఈ రోజు బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ భైరాగిగూడలో చెత్త సేకరణ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం నిషేధమని స్వచ్ఛ బండ్లగూడ జాగీర్ కొరకు సహకరించాలని తెలిపారు.
NLR: బీజేపీ కావలి పట్టణ శాఖ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యుల సమావేశం స్థానిక ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చర్చించుకున్నారు.
NLR: సంగంలోని కామాక్షీ దేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పులి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. హేమంత్ కృష్ణ అనే ప్రముఖ కళాకారుడు ముక్కుతో ఫ్లూట్ వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు.
NLG: కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు శుక్రవారం అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ పుట్టినరోజు వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి, ఏఏఓ మాధవ శెట్టి తెలిపారు. పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ మఠంలో వివిధ రకాల హోమాలు, లక్ష్మీ పూజ, నిరుపేదలకు వస్త్ర దానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
NLR: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు కలెక్టర్ ఆనంద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్లో కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు.
KRNL: పత్తికొండ పట్టణంలో ఎండ వేడికి విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా గురువారం ఒక మొబైల్ ఫ్రూట్ జ్యూస్ వాహనం దగ్ధమైంది. హోసూరు రోడ్డులో నివసించే రాజస్తాన్కు చెందిన షోభాలాలికి చెందిన ఈ వాహనం ఇంటి వద్ద నిలిపిన సమయంలో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రాకముందే వాహనం పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.8లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
HYD: జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా అండ్ సౌత్ ఏషియా విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ 2025’ అవార్డు నాలుగోసారి అందుకుంది. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.
విజయవాడ వన్ టౌన్లో విషాదం చోటుచేసుకుంది. బంగారు వ్యాపారి సాయి ప్రకాష్ రెడ్డి అప్పుల భారంతో తన ఏడేళ్ల కుమారుడు దీక్షిత్ రెడ్డికి ఐస్క్రీమ్లో సైనైడ్ ఇచ్చి చంపి, తానూ సైనైడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఆసుపత్రి చేర్చారు. కాగా ఇద్దరు చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
శ్రీకాకుళం: పట్టణంలోని 80 ఫీట్ రోడ్డులో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలో నిర్మించిన బీసీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ భవనం ప్రారంభోత్సవానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
MBNR: చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ను ఎంపీ, కలెక్టర్ ప్రారంభించారు.
TG: రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గుజరాత్లోని అమూల్ డెయిరీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డెయిరీని సందర్శించారు. అమూల్ ఉత్పత్తి, తదితర వివరాలు కాంగ్రెస్ నేతలు తెలుసుకున్నారు.
ప్రకాశం: రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అన్నారు. దీని వల్ల రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తోందని తెలిపారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ.లక్ష కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ఇక వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి 44 రోజులు జైల్లో ఉంచినట్లు గుర్తుచేశారు.