AP: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ఏడాది పొడవునా, 24 గంటలు దుకాణాలు తెరుచుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఉద్యోగుల సంక్షేమం కోసం వారానికి 48 గంటలు మాత్రమే పని చేయించాలని, ఒకరోజు సెలవు ఇవ్వాలని సూచించింది. పండుగ రోజుల్లో పని చేయిస్తే దానికి బదులుగా మరోరోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని తెలిపింది.