AP: తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రకటనలు చేయకుండా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేయగా.. అన్ని అంశాలు పరిశీలించాకే CBIతో సిట్ వేశామని, ఏదైనా ఉంటే సిట్ అధికారులకే చెప్పుకోవాలని CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సూచించింది. దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.