HNK: హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా కాజీపేటకు చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు పార్టీ శ్రేణులతో ఎమ్మెల్సీ మల్లన్న చర్చించారు. రాజ్యాధికార పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.