• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇకపై ఆయన పేరు వాడితే కఠిన చర్యలే!

బాలీవుడ్ దివంగత నటుడు రిషి కపూర్ వ్యక్తిత్వ హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆయన పేరు, ఫోటోలు, గొంతును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. రిషి కపూర్ గౌరవానికి భంగం కలగకుండా, ఆయన ఇమేజ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీతూ కపూర్, రణ‌్‌బీర్ కపూర్ పేర్కొన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

రీ- సర్వే ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం: బిక్షపతి

SRD: గ్రామాల్చేలో చేపట్టనున్న రీ- సర్వే ద్వారా రైతుల సమస్యలు పరిష్కృతం అవుతాయని డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ బిక్షపతి అన్నారు. ఇవాళ సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామ సభలో మాట్లాడుతూ.. భూమి కబ్జాలో ఉన్న రైతుకు ఎలాంటి డోకా లేదని భరోసా ఇచ్చారు. గ్రామానికి రెవెన్యూ నక్షా లేదని, త్వరలో ఇక్కడ భూ రీ సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు.

March 13, 2026 / 02:29 PM IST

బడ్జెట్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తే ముందుకు సాగాలని అన్నారు.

March 13, 2026 / 02:28 PM IST

విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

BHPL: రేపటి నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయనున్న విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భయం లేకుండా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. సరైన ప్రణాళికతో చదవడం, సమయపాలన పాటించడం ముఖ్యమని, ఇప్పటి వరకు చేసిన చదువుపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా రాస్తే మంచి ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు.

March 13, 2026 / 02:28 PM IST

‘కిడ్నీ సమస్యతో యువకుడు.. దాతల కోసం ఎదురుచూపు’

MHBD: తొర్రూరు మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీలు ఇన్ఫెక్షన్ కావడంతో కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స అవసరమని, దీనికి సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. అంతా డబ్బు చెల్లించే స్తోమత లేక ఆ నిరుపేద కుటుంబం దాతల కోసం ఎదురుచూస్తుంది.

March 13, 2026 / 02:28 PM IST

గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ

GDWL: గద్వాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో శుక్రవారం స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల వద్ద వినియోగదారులు సిలిండర్ల కోసం క్యూ కట్టారు. కాగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

March 13, 2026 / 02:28 PM IST

విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని ఆటో, లారీ డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారికి కంటి పరీక్షలు, ECG పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ రత్నం హాజరయ్యారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

March 13, 2026 / 02:28 PM IST

మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యాలు

NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలిపారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది రాకుండా గ్రీన్ మ్యాట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్ల కోసం సంబంధిత టెండర్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

March 13, 2026 / 02:27 PM IST

వంటనూనె ధరకు రెక్కలు.. సామాన్యుడికి చుక్కలు!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంటనూనెల దిగుమతులు నిలిచిపోయి ధరలు భారీగా పెరిగాయి. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్‌పై రూ. 15-20 వరకు అదనపు భారం పడింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరా ఆలస్యమవుతోంది. అర్జెంటీనా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో రాబోయే రోజుల్లో నిత్యవసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

March 13, 2026 / 02:25 PM IST

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు..!

కడప: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు శుక్రవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

March 13, 2026 / 02:25 PM IST

జిల్లాలో సర్వేక్షణ వర్క్ షాప్ ప్రారంభం

NLR: పల్లిపాడులోని డైట్‌లో PARAKH రాష్ట్రీయ సర్వేక్షణ వర్క్ షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా డీఈవో డాక్టర్ ఆర్.బాలాజీ రావు మాట్లాడుతూ.. విద్యా విధానాల్లో జరుగుతున్న మార్పులు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 38 మండలాల MEO, HMలు హాజరయ్యారు.

March 13, 2026 / 02:24 PM IST

నందిగామలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక

RR: నందిగామ మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కొమ్ము కృష్ణ ఆధ్వర్యంలో ఇంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి బిందెలు, బకెట్లు, వాటర్ సంపులను క్లీనింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:24 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

March 13, 2026 / 02:23 PM IST

భారత్ గెలవడానికి కారణం వాళ్లే..!

సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ విమర్శల వర్షం కురిపించాడు. T20 WCలో భారత్‌ను S-8లోనే ఇంటికి పంపించే అవకాశాన్ని SA చేజార్చుకుందన్నాడు. వెస్టిండీస్ చేతిలో SA ఓడిపోయి ఉంటే బాగుండేదని, వారి తెలివితక్కువ నిర్ణయం వల్ల భారత్ సెమీస్ చేరి ఛాంపియన్స్‌గా నిలిచిందని పేర్కొన్నాడు. ఆ చెత్త నిర్ణయమే భారత్ విజేతగా నిలవడానికి కారణమని విమర్శించాడు.

March 13, 2026 / 02:23 PM IST

‘సోషల్ మీడియా మనకు దూరంగా ఉండాలి’

ELR: చింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలలో ఇవాళ అవగాహనను సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఏ‌ఎస్‌పీ సుస్మిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రానున్న బోర్డు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే సబ్జెక్టు‌లపై పట్టు సాధించాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.

March 13, 2026 / 02:22 PM IST