• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

230 మంది మాజీ మావోయిస్టులకు నోటీసులు

TG: మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరైన 230 మంది మాజీ మావోయిస్టులకు NIA ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇన్నయ్యతోపాటు మరికొందరిపై దేశద్రోహం కేసులు నమోదవగా.. వీటి దర్యాప్తు కోసమే మాజీ మావోయిస్టులకు నోటీసులు జారీ చేశారని వెల్లడవుతోంది.

March 13, 2026 / 02:40 PM IST

బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవు: CI

ADB: రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. ఈ మేరకు పట్టణానికి చెందిన నిందితులు షేక్ సమీర్, సాబిల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితులు ఎవరైనా నిర్వహణలో ఉన్న జిల్లా పోలీసులను సంప్రదించవచ్చని, పోలీసులు అండగా ఉంటూ తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

March 13, 2026 / 02:39 PM IST

‘చందనపల్లి డంపింగ్ యార్డును తరలించాలి’

NLG: నల్లగొండలోని చందనపల్లి డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ఉదయసముద్రం చెరువు పక్కన ఉండటంతో నీరు కలుషితమవుతోందని, చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగతో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జంతు కళేబరాల వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.

March 13, 2026 / 02:39 PM IST

మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి :ఎమ్మెల్యే

JGL: మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, రాజా గౌడ్, మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి పాల్గొన్నారు.

March 13, 2026 / 02:39 PM IST

‘హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు రద్దు చేయాలి’

ASR: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటనకు వచ్చే ముందే హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు-2, 13, 51లను రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అరకులో మీడియాతో మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 100శాతం రిజర్వేషన్ చట్టం చేయాలన్నారు.

March 13, 2026 / 02:38 PM IST

కడుపునొప్పితో యువకుడు ఆత్మహత్య..!

నంద్యాల: జిల్లా బేతంచర్ల మండలంలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో బోయ శ్రీకాంత్ (35) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపునొప్పి తీవ్రంగా ఉండటంతో బాధను తట్టుకోలేక అత్తారింట్లో ఉరేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

March 13, 2026 / 02:37 PM IST

పరీక్ష కేంద్రాలకు విద్యుత్ అధికారుల ఇన్చార్జిలు

MDK: తూప్రాన్ పట్టణంలో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నందున విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ అధికారులను నియమించినట్లు విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. తూప్రాన్ లైన్ ఇన్‌స్పెక్టర్లు సహదేవ్, బాలయ్య ఆధ్వర్యంలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొ విద్యుత్ అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు.

March 13, 2026 / 02:36 PM IST

రేషన్ షాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీ.ఆర్ నగర్ బాంబుల గడ్డలో నూతన రేషన్ షాపును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడమే గాక సన్న బియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

March 13, 2026 / 02:36 PM IST

ప్రభుత్వంపై మూసీ జన ఆందోళన్ విమర్శలు

TG: మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్ వేళ MJA ప్రతినిధిని గృహనిర్బంధం చేయడంపై మూసీ జన ఆందోళన సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య రీతిలో చర్చలకు, ప్రత్యామ్నాయ సూచనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చి ఆ మరుసటి రోజే తమ కార్యకర్తను నిర్బంధించడాన్ని ప్రశ్నించింది. కాగా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చడాన్ని ఈ సంస్థ తప్పుబడుతోంది.

March 13, 2026 / 02:34 PM IST

క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్‌

తమిళ దిగ్గజ నటుడు, మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ‘నేను MGRను అగౌరవపరచాలని ఆ మాటలు అనలేదు. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నాడు. కాగా, దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ MGRపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

March 13, 2026 / 02:34 PM IST

బీసీ కమ్యూనిటీ హాల్ శంఖుస్ధాపన చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణం 13వ వార్డులో ప్రజల చిరకాల కోరికైన బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు శుక్రవారం ఎమ్మెల్యే శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ నూక దుర్గారాణి, తదితరులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:34 PM IST

ఆదోనిలో గ్యాస్ కొరత నిందితులపై చర్యలు..!

KRNL: ఆదోనిలో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MLA పార్థసారథి శుక్రవారం హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ అవసరాల సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. వదంతులు నమ్మవద్దని, ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

March 13, 2026 / 02:33 PM IST

ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీలు

NRML: అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలల మాదిరి మార్చి 15 నుంచి ఒంటిపూట తరగతుల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా అంగన్వాడి టీచర్లు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. మే నెలలో టేక్ హోమ్ రేషన్ పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించాలని విన్నవించారు.

March 13, 2026 / 02:32 PM IST

వరసిద్ధి వినాయక ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

SS: కదిరి పట్టణం తుమ్మల రోడ్డు అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. భక్తి భావంతో నిర్మించే ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

March 13, 2026 / 02:32 PM IST

రూ.2 లక్షల LOC చెక్కు అందజేత

SDPT: ధూళిమిట్ట మండలం కొండాపూర్‌కు చెందిన బాణోత్ మౌనిక ‘మయోపతి’ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితురాలి పరిస్థితిని యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజేష్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రతాప్ రెడ్డి సహకారంతో బాధితురాలికి రూ.2 లక్షల విలువైన LOC లెటర్‌ను ఇవాళ అందజేశారు.

March 13, 2026 / 02:31 PM IST