• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

MDK: మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి ప్యాడి క్లీనింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఆర్డీవోలు పాల్గొన్నారు.

April 10, 2025 / 06:16 PM IST

ఇకపై అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగ్స్: సీతక్క

TG: పోషకాహార రాష్ట్రం లక్ష్యంగా పని చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగులు ఇస్తామని మంచి గ్రేడ్లు సాధించిన సెంటర్లకు, సిబ్బందికి, జిల్లా అధికారులకు అవార్డులు ఇస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో  కలకలలాడాలన్నారు.

April 10, 2025 / 05:25 PM IST

త్వరలో సమంత పెళ్లి?

స్టార్ హీరోయిన్ సమంత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో వివాహం చేసుకున్నాడు. అయితే సమంత కొంత కాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అతడితో త్వరలోనే మూడు ముళ్లు వేయించుకోనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

April 10, 2025 / 05:22 PM IST

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ ఛైర్మన్

NDL: ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి గురువారం బనగానపల్లె మండలంలోని బతులూరుపాడు, ఎనకండ్ల గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాప్, గిడ్డంగులను తనిఖీ చేశారు. రేషన్ షాప్లు, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలు, గుడ్లు, సరుకులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 10, 2025 / 05:18 PM IST

‘బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తోంది’

SRPT: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందనితెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వీరయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

April 10, 2025 / 05:15 PM IST

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి: కలెక్టర్

PPM: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎప్పుడూ లేని విధంగా 12వ జాతీయ నాణ్యత హామీ ప్రమాణ సర్టిఫికెట్స్ వచ్చే విధంగా కృషి చేసిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అభినందించారు. జిల్లాలోని 15 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఉన్న మౌలిక వసతులు, రోగులకు సిబ్బంది అందించే వైద్యసేవల నాణ్యతలను పరిశీలించారు.

April 10, 2025 / 05:10 PM IST

‘CPM ఆధ్వర్యంలో కట్టెల పొయ్యి పై వంట చేసి నిరసన’

MNCL: జిల్లా తాండూర్ మండల కేంద్రం లోని SC కాలనీలో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కట్టెల పోయ్యి పై నాయకులు వంట వండడం జరిగింది. గురువారం మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై రూ.50 పెంచడం దారుణమన్నారు. క్రడ్ ఆయిల్ ధరలు తగ్గినందున గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

April 10, 2025 / 05:09 PM IST

పోషకాహారంతో రక్తహీనతకు నివారణ

SRPT: సరైన పోషకాహారం ఉంటే రక్తహీనతను నివారించవచ్చు అని అంబేద్కర్ నగర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ రమ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆకుకూరలు, పాలు అధికంగా తీసుకోవాలని సూచించారు.

April 10, 2025 / 05:06 PM IST

యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ తనిఖీ

KRNL: పోలీసు శాఖ యాంటీ ఈవ్ టీజింగ్ బీట్‌లను ప్రత్యేకంగా తనిఖీ చేస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం ఈవ్ టీజింగ్, ఆకతాయి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో బీట్లు నడుపుతూ విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు.

April 10, 2025 / 05:06 PM IST

JNTUHలో కొత్త బాసులొచ్చారు!

HYD: JNTUH కాలేజీలో పలు ఇంజినీరింగ్ విభాగాలకు హెచ్ఐడీలను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ హెచ్ఐడీగా ప్రొ.జనార్ధన్ యాదవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనేషన్ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ మాధవీ కుమారి, మెటలర్జికల్ హెచ్ఐడీగా ప్రొఫెసర్ దేవకి రాణిలను నియమిస్తూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు.

April 10, 2025 / 05:05 PM IST

వైసీపీ నాయకులకు అండగా ఉంటా

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన పలు అంశాలపై స్పందించి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 10, 2025 / 05:04 PM IST

పంట పొలాలను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను గురువారం ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి పంటల నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ అకాల వర్షం వల్ల తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందన్నారు.

April 10, 2025 / 05:00 PM IST

ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు..

KMM: నేలకొండపల్లి, ముదిగొండ మండలంలో ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు తప్పడం లేదని రైతులు వాపోయారు. గురువారం పలువురు రైతులు మాట్లాడుతూ.. మిల్లర్లు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా మిల్లుకు తీసుకురావాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లుకు ధాన్యం తరలిస్తే రూ.1800లకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ అందిస్తామని చెప్తున్నట్లు తెలిపారు.

April 10, 2025 / 05:00 PM IST

‘లోకో పైలట్లపై పని భారం తగ్గించాలి’

VZM: రైల్వే లోకో పైలెట్లపై పని భారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. బొబ్బిలి సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. లోకో పైలెట్లకు విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పని చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, తక్షణమే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

April 10, 2025 / 04:58 PM IST

‘సన్న బియ్యం భోజనం చేసిన అధికారులు’

MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామంలో మండల అధికారులు సన్న బియ్యం భోజనం చేశారు.. ఆ గ్రామానికి చెందిన లబ్ధిదారులు మడావి బాదిరావు, లింగారెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజా మనోహర్ రెడ్డి, ఎంపిడిఓ షరీఫ్, డిప్యూటి తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ భానుచందర్ సన్న బియ్యం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్, కార్యదర్శి సరితా ఉన్నారు.

April 10, 2025 / 04:52 PM IST