• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జర్నలిస్టుపై దాడి ఖండించిన జెడ్పీ ఛైర్మన్

VZM: మక్కువ మండలానికి చెందిన ఓ ప్రముఖ పత్రకా విలేఖరి రామారావుపై టీడీపీ నాయకుడు దాడి చేయడాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదని, వ్యతిరేక వార్తలు రాసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా దానికి వివరణ ఇవ్వాలని, ప్రకటన ద్వారా ఖండించాలి తప్ప, దాడులు సరైనవి కాదన్నారు.

February 17, 2025 / 01:52 PM IST

ఫిర్యాదుదారులకు అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ

NRML: ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్నినిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని సూచించారు.

February 17, 2025 / 01:51 PM IST

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా యువకుల రక్తదానం’

ADB: మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నేరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు వారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందించారు. మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సంతోష్ సింగ్ తదితరులున్నారు.

February 17, 2025 / 01:47 PM IST

‘సమ్మెకు సిద్ధంగా ఉండండి’

ELR: చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడి కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌వి ఎస్ నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన అంగన్వాడీల బ్రతుకు మారలేదన్నారు. 42 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ నేటి వరకు అమలు కాలేదన్నారు. రాబోయే కాలంలో మరో సమ్మె చేస్తామన్నారు.

February 17, 2025 / 01:27 PM IST

‘జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి’

W.G: మన్యం జిల్లాలోని మక్కువ మండల విలేకరి మాల్యాడ రామారావుపై మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ దాడి చేయడాన్ని నిరసిస్తూ యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ గ్రంధి పవన్ కుమార్‌కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.

February 17, 2025 / 01:17 PM IST

ప్రధాన సమస్యలపై సీపీఎం వినతులు

ATP: రాయదుర్గం పట్టణంలో ప్రధానంగా డ్రైనేజీలు, కాలువలు లేక వివిధ వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్న విషయం తెలిసిందే.

February 17, 2025 / 01:15 PM IST

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

SRD: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీవెన్స్ హాలులో డీఆర్ఓ పద్మజా రాణి, డీపీఓ సాయిబాబా ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న అధికారులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

February 17, 2025 / 01:00 PM IST

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ATP: గుంతకల్లు పట్టణ శివారులో సోమవారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

February 17, 2025 / 12:57 PM IST

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ

సత్యసాయి: రొద్దం మండల పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహశీల్దార్ ఉదయ శంకర్ రాజు, ఎంపీడీఓ  ప్రేమ్ కుమార్లను ఎంపీ పార్థసారథి ఆదేశించారు. సోమవారం మరువపల్లిలో తన స్వగృహంలో అధికారులతో సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

February 17, 2025 / 12:33 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

SRD: కోహిర్ మండలం గోటియర్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అర్జున్ పవన్, శంకర్ కోహిర్ మండలంలోని ఓ విందుకు వెళ్లారు. సిద్దాపూర్ తాండాలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

February 17, 2025 / 12:22 PM IST

ఆలియా భట్ అరుదైన ఘనత

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన నటీమణుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. పలువురు హాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లను ఆమె వెనక్కునెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ ప్రకటించారు. కాగా, ఆలియాకు ఇన్‌స్టాలో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

February 17, 2025 / 11:26 AM IST

మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

KMR: రాజంపేట మండల కేంద్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బల్వంత్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ అశోక్, మాజీ రైతు బందు అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎస్టీ సెల్ గణేష్ నాయక్, మండల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

February 17, 2025 / 11:24 AM IST

ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలి: డీఐఈవో

NRML: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాం సూచించారు. తానూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.

February 17, 2025 / 11:13 AM IST

అక్రమ రవాణ చేస్తున్న ఆవులను పట్టుకున్న గ్రామస్తులు

BHNG: చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామ సమీపంలో అక్రమంగా 9 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పశువులను, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్ప చెప్పారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. ఈ ఘటనపై వాహనం సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

February 17, 2025 / 11:09 AM IST

శిక్షణ తరగతుల్లో జిల్లా నియోజవర్గ అధ్యక్షులు

KMR: యువజన కాంగ్రెస్ జిల్లా,నియోజకవర్గ అధ్యక్షులకు 3రోజులు శంషాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువ క్రాంతి బునియాద్’కు ఢిల్లీ నుంచి వచ్చిన బృందం నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణలో KMR జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జుక్కల్, బాన్సువాడ అధ్యక్షులు ఇమ్రోజ్, మన్సూర్ పాల్గొన్నారు. 

February 17, 2025 / 11:08 AM IST