• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరువూరులో ఎంపీడీవో కార్యాలయం వేదికగా చెత్త సేకరణ రిక్షాలను, డస్ట్ బిన్‌లను స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి ఈ పరికరాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

ఇంటర్ ఫిజిక్స్ పరీక్షకు 335 మంది గైర్హాజరు

TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్–II పరీక్ష శుక్రవారం జిల్లాలోని 84 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 24,313 మంది విద్యార్థులకు గాను 23,978 మంది హాజరుకాగా 335 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణతో పాటు త్రాగునీరు, మెడికల్ సిబ్బంది ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 13, 2026 / 02:30 PM IST

సీసీ రోడ్డు ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

WG: పాలకోడేరు మండలం గోరగనమూడిలో రూ. 82 లక్షల వ్యయంతో నిర్మించిన 2 కిలోమీటర్ల రూరల్ కనెక్టివిటీ సీసీ రోడ్డును డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రాజు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

‘గ్యాస్ బుకింగ్‌కు ప్రత్యామ్నాయ నెంబర్లు తీసుకొస్తాం’

E.G: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలెవరూ అనవసరంగా సిలిండర్లను నిల్వ చేసుకోవద్దని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సివిల్ సప్లయిస్ అధికారులు, డీలర్లతో చర్చిస్తున్నామని తెలిపారు. గ్యాస్ బుకింగ్‌కి ప్రత్యామ్నాయ నెంబర్లు తీసుకొస్తామని పేర్కొన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

ఇంటి పన్నులను సకాలంలో చెల్లించాలి: MDO

BPT: కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలో ఇంటి పన్ను వసూళ్లు కార్యక్రమాన్ని శుక్రవారం ఎండీవో రాజ్యలక్ష్మి పరిశీలించారు. ఇంటి పన్ను వసూలు అవుతున్న తీరును ఆమె పంచాయతీ సెక్రెటరీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీవో మాట్లాడుతూ.. ప్రజలు నిర్దేశించిన గడువులో ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

‘ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి’

కృష్ణా: ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శుక్రవారం అవనిగడ్డ మండలం వేకనూరులో ఎంవీ కృష్ణారావు శత జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా తరువాత గుండె, మెదడు సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

March 13, 2026 / 02:30 PM IST

పేదలకు వస్త్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ 22వ డివిజన్‌లో సయ్యద్ చాంద్ మాతృమూర్తి జ్ఞాపకార్థం పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పేదలకు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

ఇకపై ఆయన పేరు వాడితే కఠిన చర్యలే!

బాలీవుడ్ దివంగత నటుడు రిషి కపూర్ వ్యక్తిత్వ హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆయన పేరు, ఫోటోలు, గొంతును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. రిషి కపూర్ గౌరవానికి భంగం కలగకుండా, ఆయన ఇమేజ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీతూ కపూర్, రణ‌్‌బీర్ కపూర్ పేర్కొన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

రీ- సర్వే ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం: బిక్షపతి

SRD: గ్రామాల్చేలో చేపట్టనున్న రీ- సర్వే ద్వారా రైతుల సమస్యలు పరిష్కృతం అవుతాయని డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ బిక్షపతి అన్నారు. ఇవాళ సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామ సభలో మాట్లాడుతూ.. భూమి కబ్జాలో ఉన్న రైతుకు ఎలాంటి డోకా లేదని భరోసా ఇచ్చారు. గ్రామానికి రెవెన్యూ నక్షా లేదని, త్వరలో ఇక్కడ భూ రీ సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు.

March 13, 2026 / 02:29 PM IST

బడ్జెట్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తే ముందుకు సాగాలని అన్నారు.

March 13, 2026 / 02:28 PM IST

విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

BHPL: రేపటి నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయనున్న విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భయం లేకుండా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. సరైన ప్రణాళికతో చదవడం, సమయపాలన పాటించడం ముఖ్యమని, ఇప్పటి వరకు చేసిన చదువుపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా రాస్తే మంచి ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు.

March 13, 2026 / 02:28 PM IST

‘కిడ్నీ సమస్యతో యువకుడు.. దాతల కోసం ఎదురుచూపు’

MHBD: తొర్రూరు మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీలు ఇన్ఫెక్షన్ కావడంతో కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స అవసరమని, దీనికి సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. అంతా డబ్బు చెల్లించే స్తోమత లేక ఆ నిరుపేద కుటుంబం దాతల కోసం ఎదురుచూస్తుంది.

March 13, 2026 / 02:28 PM IST

గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ

GDWL: గద్వాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో శుక్రవారం స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల వద్ద వినియోగదారులు సిలిండర్ల కోసం క్యూ కట్టారు. కాగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

March 13, 2026 / 02:28 PM IST

విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని ఆటో, లారీ డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారికి కంటి పరీక్షలు, ECG పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ రత్నం హాజరయ్యారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

March 13, 2026 / 02:28 PM IST

మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యాలు

NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలిపారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది రాకుండా గ్రీన్ మ్యాట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్ల కోసం సంబంధిత టెండర్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

March 13, 2026 / 02:27 PM IST