MHBD: తొర్రూరు మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీలు ఇన్ఫెక్షన్ కావడంతో కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స అవసరమని, దీనికి సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. అంతా డబ్బు చెల్లించే స్తోమత లేక ఆ నిరుపేద కుటుంబం దాతల కోసం ఎదురుచూస్తుంది.
GDWL: గద్వాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో శుక్రవారం స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల వద్ద వినియోగదారులు సిలిండర్ల కోసం క్యూ కట్టారు. కాగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని ఆటో, లారీ డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారికి కంటి పరీక్షలు, ECG పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ రత్నం హాజరయ్యారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలిపారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది రాకుండా గ్రీన్ మ్యాట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్ల కోసం సంబంధిత టెండర్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంటనూనెల దిగుమతులు నిలిచిపోయి ధరలు భారీగా పెరిగాయి. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్పై రూ. 15-20 వరకు అదనపు భారం పడింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరా ఆలస్యమవుతోంది. అర్జెంటీనా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో రాబోయే రోజుల్లో నిత్యవసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కడప: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు శుక్రవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
NLR: పల్లిపాడులోని డైట్లో PARAKH రాష్ట్రీయ సర్వేక్షణ వర్క్ షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా డీఈవో డాక్టర్ ఆర్.బాలాజీ రావు మాట్లాడుతూ.. విద్యా విధానాల్లో జరుగుతున్న మార్పులు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 38 మండలాల MEO, HMలు హాజరయ్యారు.
RR: నందిగామ మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కొమ్ము కృష్ణ ఆధ్వర్యంలో ఇంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి బిందెలు, బకెట్లు, వాటర్ సంపులను క్లీనింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సౌతాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ విమర్శల వర్షం కురిపించాడు. T20 WCలో భారత్ను S-8లోనే ఇంటికి పంపించే అవకాశాన్ని SA చేజార్చుకుందన్నాడు. వెస్టిండీస్ చేతిలో SA ఓడిపోయి ఉంటే బాగుండేదని, వారి తెలివితక్కువ నిర్ణయం వల్ల భారత్ సెమీస్ చేరి ఛాంపియన్స్గా నిలిచిందని పేర్కొన్నాడు. ఆ చెత్త నిర్ణయమే భారత్ విజేతగా నిలవడానికి కారణమని విమర్శించాడు.
ELR: చింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలలో ఇవాళ అవగాహనను సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రానున్న బోర్డు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే సబ్జెక్టులపై పట్టు సాధించాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.
VKB: బషీరాబాద్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను కేటాయించింది. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయడం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 11వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్ పర్సన్, పాలకవర్గం సభ్యులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలుషిత నీరు తాగవద్దని సూచించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని అన్నారు.
MBNR: మిడ్జిల్ మండలంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి వారు విన్నవించారు. స్పందించిన మాజీ మంత్రి విగ్రహ ఏర్పాటుకు రూ. 5,50,000 విరాళాన్ని ప్రకటించారు. అలాగే నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయానికి కూడా తన వంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే మహిళలకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించాలని చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణకు మంత్రి సూచించారు.