• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి’

W.G: మన్యం జిల్లాలోని మక్కువ మండల విలేకరి మాల్యాడ రామారావుపై మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ దాడి చేయడాన్ని నిరసిస్తూ యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ గ్రంధి పవన్ కుమార్‌కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.

February 17, 2025 / 01:17 PM IST

ప్రధాన సమస్యలపై సీపీఎం వినతులు

ATP: రాయదుర్గం పట్టణంలో ప్రధానంగా డ్రైనేజీలు, కాలువలు లేక వివిధ వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్న విషయం తెలిసిందే.

February 17, 2025 / 01:15 PM IST

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

SRD: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీవెన్స్ హాలులో డీఆర్ఓ పద్మజా రాణి, డీపీఓ సాయిబాబా ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న అధికారులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

February 17, 2025 / 01:00 PM IST

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ATP: గుంతకల్లు పట్టణ శివారులో సోమవారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

February 17, 2025 / 12:57 PM IST

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ

సత్యసాయి: రొద్దం మండల పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహశీల్దార్ ఉదయ శంకర్ రాజు, ఎంపీడీఓ  ప్రేమ్ కుమార్లను ఎంపీ పార్థసారథి ఆదేశించారు. సోమవారం మరువపల్లిలో తన స్వగృహంలో అధికారులతో సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

February 17, 2025 / 12:33 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

SRD: కోహిర్ మండలం గోటియర్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అర్జున్ పవన్, శంకర్ కోహిర్ మండలంలోని ఓ విందుకు వెళ్లారు. సిద్దాపూర్ తాండాలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

February 17, 2025 / 12:22 PM IST

ఆలియా భట్ అరుదైన ఘనత

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన నటీమణుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. పలువురు హాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లను ఆమె వెనక్కునెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ ప్రకటించారు. కాగా, ఆలియాకు ఇన్‌స్టాలో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

February 17, 2025 / 11:26 AM IST

మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

KMR: రాజంపేట మండల కేంద్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బల్వంత్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ అశోక్, మాజీ రైతు బందు అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎస్టీ సెల్ గణేష్ నాయక్, మండల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

February 17, 2025 / 11:24 AM IST

ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలి: డీఐఈవో

NRML: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాం సూచించారు. తానూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.

February 17, 2025 / 11:13 AM IST

అక్రమ రవాణ చేస్తున్న ఆవులను పట్టుకున్న గ్రామస్తులు

BHNG: చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామ సమీపంలో అక్రమంగా 9 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పశువులను, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్ప చెప్పారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. ఈ ఘటనపై వాహనం సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

February 17, 2025 / 11:09 AM IST

శిక్షణ తరగతుల్లో జిల్లా నియోజవర్గ అధ్యక్షులు

KMR: యువజన కాంగ్రెస్ జిల్లా,నియోజకవర్గ అధ్యక్షులకు 3రోజులు శంషాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువ క్రాంతి బునియాద్’కు ఢిల్లీ నుంచి వచ్చిన బృందం నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణలో KMR జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జుక్కల్, బాన్సువాడ అధ్యక్షులు ఇమ్రోజ్, మన్సూర్ పాల్గొన్నారు. 

February 17, 2025 / 11:08 AM IST

పెద్దగట్టు జాతరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

JGL: జిల్లాలో పెద్దగట్టు జాతర అంగరంగవైభవంగా ప్రారంభం అయింది. జాతరలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు రూ.5 కోట్లు కేటాయించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

February 17, 2025 / 11:01 AM IST

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదును సత్వరమే పరిష్కరించాలి

KMR: కామరెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ఏవో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

February 17, 2025 / 10:51 AM IST

రిమాండ్ ఖైదీ మృతి

ASR: కొయ్యూరు మండలంలోని బకులూరు గ్రామానికి చెందిన బీ.రాజుబాబు అనే రిమాండ్ ఖైదీ మృతి చెందాడని ఎస్సై పీ.కిషోర్ వర్మ సోమవారం తెలిపారు. కోట్లాట కేసుకు సంబంధించి రాజుబాబు విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఊపిరి తిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని జైలు సిబ్బంది కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

February 17, 2025 / 10:42 AM IST

‘హరితహారం ఘనత మాజీ సీఎం కెసిఆర్‌కే దక్కుతుంది’

NRML: నిర్మల్ మండలంలోని కొండాపూర్‌లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ హరితహారంతో రాష్ట్రాన్ని పచ్చదనంగా అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందని అన్నారు.

February 17, 2025 / 10:42 AM IST