VKB: బషీరాబాద్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను కేటాయించింది. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయడం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.