• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేత

WGL: మరణించిన పోలీస్ కుటుంబాలకు ఎప్పటికీ అండగా ఉంటామని సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో సందానందం అనే హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో గత సంవత్సరం సెప్టెంబర్ 13న మరణించాడు. ఈక్రమంలో పోలీసు భద్రత విభాగం నుంచి ఆయనకు రూ. 7 లక్షల 89 వేల 920 విలువైన చెక్కు మంజూరయింది. ఈ చెక్కును సీపీ ఈరోజు లబ్ధిదారునికి అందజేశారు.

April 10, 2025 / 10:25 AM IST

వాహనదారులకు అలర్ట్

ములుగు: ఏటూరునాగారానికి చెందిన స్థానికులు అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద తమ వాహనాలకు ఫాస్టాగ్ మినహాయింపూ కోసం వాహన ఆర్సీ, ఆధార్ కార్డ్ అందజేయాలని అటవీశాఖ (దక్షిణం) రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు వివరాలు అందజేయాలని, లేని పక్షంలో వాహనాలకు ఎలాంటి మినహాయింపూ ఉండదని పేర్కొన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 10, 2025 / 10:08 AM IST

నేడు కలెక్టరేట్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం: జేసీ

కోనసీమ: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కలెక్టరేట్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తామని జేసీ నిశాంతి తెలిపారు. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించి ఫిర్యాదులను కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో పరిష్కరిస్తామన్నారు.

April 10, 2025 / 09:40 AM IST

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా ప్రసాద్

KKD: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా జిఏవిఎస్‌వి ప్రసాద్ ఎన్నికయ్యారు. కాకినాడ గాంధీభవన్‌లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. 146 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో ప్రసాద్ 12 ఓట్ల మెజార్టీతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షున్ని మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ అభినందించారు.

April 10, 2025 / 09:33 AM IST

31 అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు

KRNL: జిల్లాలో 672 వార్డు, గ్రామ సచివాలయాలు ఉండగా.. నేటి నుంచి 31 కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈవో నాసరరెడ్డి తెలిపారు. జిల్లాలో 134 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ కేంద్రాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆధార్ నమోదుకు ప్రజల తాకిడి ఎక్కువ అయినందున ఆధార్ కేంద్రాలను పెంచినట్లు స్పష్టం చేశారు.

April 10, 2025 / 09:31 AM IST

నెల్లూరులో మధ్యాహ్నం వరకు పవర్ కట్

నెల్లూరు: నగరంలోని శెట్టిగుంట రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలో రిపేర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీనివాస నగర్, జాకీర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, సింహపురి కాలనీ, మైపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఈఈ ఎం శ్రీధర్ పేర్కొన్నారు.

April 10, 2025 / 08:14 AM IST

దమ్మపేటలో పోషణ పక్షం అవగాహన సదస్సు

BDK: దమ్మపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వక్షహించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి, శారీరక మానసిక ఎదుగుదలకు పుట్టిన తొలి నాళ్లలో మొదటి 1000 రోజులలో తీసుకునే సమతుల్య, పోషకాహారం ఎంతో కీలకం అని జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

April 10, 2025 / 08:09 AM IST

విద్యానికేతన్ పాఠశాలలో శక్తి యాప్‌పై అవగాహన

అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో శక్తి యాప్‌పై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ యాప్ మహిళల భద్రత కోసం రూపొందించబడిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు రక్షణ అవసరమైనప్పుడు సహాయపడుతుందని అన్నారు. యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చేస్తే లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లో పోలీసులు బాధితుల వద్దకు చేరుకుంటారని తెలిపారు.

April 10, 2025 / 07:52 AM IST

‘జిల్లాలో ఆడియో లాంచ్ చేయడం ఆనందంగా ఉంది’

CTR: ‘అందమంటే నందమూరి వంశానికే సొంతం’ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులో జరుగుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిత్తూరులో ఈ చిత్ర ఆడియోను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

April 10, 2025 / 07:41 AM IST

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి: కలెక్టర్

KMM: మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వసతులు, వైద్య కళాశాలలో సౌకర్యాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. టాయిలెట్ల మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు.

April 10, 2025 / 07:41 AM IST

కూతురిని చంపి తల్లి సూసైడ్

PDPL: పెద్దపల్లి టీచర్స్ కాలనీలో కూతురిని చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో రామడుగుకు చెందిన సాహితికి పెళ్లైంది. బుధవారం రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చే సరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2025 / 07:40 AM IST

44 హైవే పై రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

ATP: గుత్తి పట్టణ శివార్లోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం బొలెరో వాహనం బైక్ ఢీకొంది.ఈ ప్రమాదంలో బైక్ మీద వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

April 10, 2025 / 07:32 AM IST

షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడి మృతి

విశాఖలో షిప్ యార్డ్‌లో సొసైటీ కార్మికుడిగా పనిచేస్తున్న అప్పారావు విద్యుత్ షాక్‌కు గురై పైనుంచి కింద పడి మృతి చెందారు. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన పిలక అప్పారావు బుధవారం హాల్ షాప్ విభాగంలో పనిచేస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ విద్యాసాగర్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

April 10, 2025 / 07:09 AM IST

రేణిగుంటలో 77 మందిపై కేసులు

TPT: వాహనాలతో రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తే చర్యలు తప్పవని రేణిగుంట DSP శ్రీనివాసరావు అన్నారు. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట, గాజులమండ్యం ఏర్పేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపిన 77 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరపరచగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున జరిమానా విధించారు.

April 10, 2025 / 07:07 AM IST

చీడిపాలెం జంక్షన్ వద్ద 172 కేజీల గంజాయి స్వాధీనం

ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద 172.310 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ పీ.వెంకటరమణ బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ఎస్సై పీ.కిషోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా, ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ మేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

April 10, 2025 / 07:03 AM IST