NZB: కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్లో తెలంగాణ సెక్రటేరియట్ హాకీ టీం విజయం సాధించిందని కెప్టెన్ డాక్టర్ స్వామి కుమార్ తెలిపారు. హోరాహోరి పోరులో మధ్యప్రదేశ్ జట్టుపై నాలుగు మూడు స్కోర్తో ఘనవిజయం సాధించింది. 3-3తో డ్రాగ ముగుస్తున్న సమయంలో చివరి నిమిషంలో జనార్ధన్ గోల్ కోటడంతో విజయం సాధించినట్లు తెలిపారు.
GNTR: నారాకోడూరు రోడ్డు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ప్రమాద ఘటనపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారన్న వార్త కలిచి వేసిందన్నారు. భాదితులకు అండగా ఉంటామని అన్నారు.
VSP: మధురవాడ ఐటీ రోడ్డులోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని అర్చకులు సుబ్బారావు తెలిపారు. నమకం చమకం – మహన్యాస పూర్వక అభిషేకంతో ప్రారంభమై రుద్రాభిషేకం, అభిషేకాలు, లింగోద్భవ పూజలు ఉంటాయన్నారు. సోమవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు.
SRD: సిర్గాపూర్ మండలం బొక్కస్ గాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గం పదవి కాలం మరో 6 నెలల పాటు ప్రభుత్వం పొడిగించిందని చైర్మన్ గుండు వెంకట్ రాములు తెలిపారు. తమ పాలకవర్గం పదవీకాలం పూర్తి చేసుకోవడంతో అభివృద్ధి కుంటు పడకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పదవి కాలం పొడిగింపు పట్ల పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
SRD: సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో రెండు కోట్లతో నిర్మిస్తున్న బీసీ బాలుర హాస్టల్ భవన నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆరు నెలల నుంచి ఇక్కడ పనులు జరగడం లేదు. తలుపులు కిటికీలో బిగించి రంగులు వేస్తే హాస్టల్ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. స్పందించి హాస్టల్ భవన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
SRD: పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్ (42) ఉపాధి కోసం అమీన్పూర్ వెళ్లి, బామ్మర్ది నరేశ్ నాయక్తో కలిసి జేసీబీ కొనుగోలు చేశాడు. నెల క్రితం దానికి పోస్టల్ బీమా చేయించగా, బావ మృతిచెందితే డబ్బు వస్తుందని ఆశపడి సురేశ్, మేనమామ దేవీసింగ్తో కలిసి ఈనెల 14న బీమా డబ్బుల కోసం హత్య చేశారు.
MBNR: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై శివనాగేశ్వర్నాయుడు తెలిపిన వివరాలు.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్కి చెందిన సోప్పరి రాఘవేందర్ మిడ్జిల్ మండలం చిల్వేర్లో పెళ్లికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
SRD: పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈనెల 17 నుంచి మార్చి 15వ తేదీ వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం తెలిపారు. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్ జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని ఆమె చెప్పారు.
సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో మహిళపై శనివారం రాత్రి అత్యాచారం జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన గిరిజన దంపతులు అనంతపురం జిల్లా నేరేడుగొండలోని సేవాలాల్ దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఫసల్వాది సమీపంలోకి రాగానే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న భర్తపై దాడి చేశారు.
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వెండి ఆభరణాలతో పాటు వివిధ పుష్పాలతో శివరూపిణి అలంకారంలో తీర్చిదిద్దారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https:// www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించారు.
ELR: చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అక్కల రామచంద్రరావు అనే వ్యక్తి మోటార్ సైకిల్ కొన్ని రోజుల క్రితం అదే గ్రామంలో దొంగతనానికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను భీమడోలు పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 4 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
VZM: IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్లను ఈ సీజన్లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియంలో తమ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ తలపడనుంది.
VZM: సంతకవిటి మండలం తాలాడలో ఉమారామలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
VZM: రోడ్డు ప్రమాదంలో వేపాడ మండలం వీలుపర్తికి చెందిన జి.రవికుమార్(25) ఆదివారం మృతి చెందాడు. అన్నవరంలో జరిగిన తన మేనమామ పెళ్లికి వెళ్లి బైక్పై నానాజీ అనే వ్యక్తిని తీసుకొని వస్తున్న క్రమంలో తుని వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా నానాజీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.