NGKL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ మండలంలోని మంతటి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
PLD: రెంటచింతల హోసన్నా మందిరం వద్ద ప్రమాదం జరిగింది. దోర్నాల నుంచి గురజాల మండలానికి మొక్కజొన్న కండేలు కోయడానికి వెళ్తున్న బొలెరో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న 25 మంది కూలీలలో 22 మంది గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే గురజాల ఆసుపత్రికి తరలించారు.
PPM: గిరిజన పీజీఆర్ఎస్తో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జేసీ, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర హాల్లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 మంది గిరిజనుల నుండి అర్జీలను స్వీకరించారు.
VSP: కవయిత్రి మొల్ల జయంతిని శుక్రవారం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జేసీ గొబ్బిళ్ల విద్యాధరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొల్ల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
HNK: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత FMD టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం MLA KR నాగరాజు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఉచితంగా FMD టీకాలు వేస్తున్నామని, పశుసంపదను రక్షించి పాల ఉత్పత్తి పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
SKLM: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV టీకాల కార్యక్రమాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ .ఈశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. బాలికలకు భవిష్యత్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా అందిస్తుందని అన్నారు. 15 ఏళ్లలోపు బాలికలు HPV టీకాను వేయించుకోవాలని ఆయన సూచించారు.
NLG: నూతన ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటించి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
KNR: గంగాధర (M) నారాయణపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రిజర్వాయర్ నిండితే తమ ఇళ్లలోకి నీరు చేరి సర్వం కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పాలకులు విస్మరించారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
WG: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఫ్రైడే – డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మీ, మేల్ అసిస్టెంట్ నాగ భూషణం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని, వ్యర్థాలను తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా.. టీజర్ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
ADB: సాత్నాల మండలంలోని సుందరగిరి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఉప సర్పంచ్ గౌతంరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పాఠశాలలో బలోపేతానికి గ్రామస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
భోజనం తర్వాత సోంపు తినడం కేవలం నోటి తాజాదనం కోసమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనిలోని కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి, ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం మంచి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని కుమ్మరి సంఘం అధ్యక్షుడు నీలకంఠం నరేష్, కార్యదర్శి ఊట్కూరి రమేష్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. 15వ శతాబ్దంలో మహిళా విద్యపై ఆంక్షలున్నా, రామాయణాన్ని సరళమైన తెలుగులో రచించారని, బడుగు వర్గాల నుండి వచ్చిన మొల్ల.. మహిళలు సాహిత్యంలో తక్కువ కాదని నిరూపించారని సర్పంచ్ వెంకటేశం అన్నారు.
KMR: పట్టణంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇటీవల ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమై కన్నతండ్రే చెరువులో తోసి హతమార్చిన ఘటన మరువక ముందే బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ సమీపంలో ఉన్న బాలసదనంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.