AP: ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి జరుగుతుందని వెల్లడించారు. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండని సూచించారు. రాష్ట్ర ఆదాయ లక్ష్యం రూ.1.37 లక్షల కోట్ల సాధనపై దృష్టి పెట్టాలని తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదు అవుతోందని సీఎం పేర్కొన్నారు.
TG: కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్సింగ్కు మాజీమంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపుతో పౌరుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయన్నారు. భూటాన్, పాక్, శ్రీలంక కంటే భారత్లోనే పెట్రోల్ రేట్లు అధికం అని తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ఆయిల్ ధరలు తగ్గినా కేంద్రం తగ్గించలేదని పేర్కొన్నారు.
AP: మాజీ మంత్రి జోగి రమేష్కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో నీటీసులు ఇచ్చింది. ఈ నెల 11న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో ఇప్పటివరకు జోగి మూడు సార్లు విచారణకు హాజరయ్యారు.
AP: సింగపూర్లో అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోసం లేడీ అఘోరి ప్రత్యేక పూజలు చేసింది. ‘పవన్ కళ్యాణ్ మీరేం బాధ పడకండి, మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. నావంతు కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరు సనాతన ధర్మం కోసం పోరాడండి’ అని వెల్లడించింది.
శ్రీకాకుళం: కంచిలి మండలం ఘాటి ముకుందపురం గ్రామంలో శ్రీ త్రినాథ స్వామి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) మందిర ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మేరకు విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రతిష్ఠ చేశారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, కమిటీ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
W.G: నాటి ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలపై బుధవారం ఉండిలో ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణకు హాజరైన ఆమె వింత సమాధానాలు వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అన్నారు. MBBS చదివిన ఆమెకు శరీరంపై గాయాలు గురించి అవగాహన లేదనడం వింతగా ఉందన్నారు.
HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులోని మామిడి తోటలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నహాకా సమావేశాన్ని కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి నేడు ప్రారంభించారు. ఈనెల 27న జరుగు సమావేశానికి భారీగా కార్యకర్తలు తరలిరావాలని దానికి తగినట్లుగా రవాణా భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు కార్పొరేటర్ కార్యకర్తలకు తెలిపారు
SKLM: రాష్ట్ర హోంమంత్రి అనిత శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
HNK: జిల్లా కేంద్రంలోని ఏకశిల పార్కులో నేడు దళిత బహుజన ఫెడరేషన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మహనీయుల జయంతి మాసోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దళిత బహుజన సాధికారత జాతీయ కార్యదర్శి శంకరన్న కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
శ్రీకాకుళం: నగరంలోని పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా షాపులు ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్న ఇటీవల ఆదేశించారు. దీంతో వ్యాపారులంతా బుధవారం ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. స్థలాలు కేటాయింపుపై చర్యలు తీసుకుంటామన్నారు.
SKLM: సీతంపేట మండల రేగులగూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సవర లక్ష్మణరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పాలకొండ ఎమ్మెల్యే జయక్రిష్ణ కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. వారికి స్వయంగా కొంత ఆర్ధిక సహాయం చేశారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించుటకు తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.
KMR: మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ గ్రామంలో బుధవారం ఏఈవో రేణుక వరి పంటను పరిశీలించారు. వరి పంటలో దోమపోటు ఉధృతిని గమనించారు. రైతులు దోమపోటు నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు నిర్వహించి, ఎకరానికి బుఫ్రోఫెసిన్ 320 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 120 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకోవాలని సూచించారు.
W.G: భీమవరం పోలీస్ క్వార్టర్స్లోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా అద్నాన్ నయీం అస్మి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం నిరుపేదలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జయ సూర్య పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని మదనపల్లెకు చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తానన్నారు.
TPT: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుస్సాలువతో సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.