ప్రకాశం: కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో నిర్వహించనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొండపి ఎస్సై, దేవస్థాన ఈవో కలిసి ఉత్సవ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. తిరునాళ్ల సమయంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.