NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో ఇవాళ చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన, రుద్రాభిషేకం చేశారు. ప్రత్యేక వారంగా భావించి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు సౌకర్యాల కోసం కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.