• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రీ సర్వేపై అవగాహన కల్పించిన ఆర్డీఓ

తూ.గో: పాతపట్నం మండలం గంధం సరియా, గురండి గ్రామాల్లో బుధవారం రీ సర్వే కార్యక్రమం రెండవ విడత జరిగింది. గ్రామాలలో రాబోయే రెండు నెలల కాలంలో రైతుల సమక్షంలో భూముల సర్వే నిర్వహిస్తారని తహసీల్దార్ తెలిపారు. అందులో భాగంగా గురండి గ్రామంలో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించుటకు నిర్వహించిన గ్రామ సభ, ర్యాలీలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

April 9, 2025 / 04:26 PM IST

ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్‌: ఎమ్మెల్యే

శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్‌ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

April 9, 2025 / 04:24 PM IST

బ్రహ్మోత్సవాలకు 13 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు: CI

KDP: ఏప్రిల్ 11న ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా 13 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీఐ బాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కడప- చెన్నై జాతీయ రహదారి ఉప్పరపల్లె పంచాయతీ సాయిబాబా గుడి సమీపంలో కారు, బస్సు, ద్విచక్ర వాహనాల తదితర వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని ఆయన సూచించారు.

April 9, 2025 / 04:24 PM IST

మెడల్ సాధించిన క్రీడాకారిణిని సన్మానించిన ఎమ్మెల్యే

HNK: ఇటీవల జరిగిన కేలో ఇండియా యూత్ గేమ్స్ నేషనల్ & ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో ఫెన్సింగ్ స్పోర్ట్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన శ్రీజను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మెడల్ అందజేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.

April 9, 2025 / 04:24 PM IST

బస్సు కోసం రాస్తారోకో

KMR: రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిపించాలని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. బీంగల్-కామారెడ్డి ప్రధాన రహదారిపై మద్దికుంట మర్రివద్ద డ్వాక్రా సంఘాలు, కాలేజీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఎన్నిసార్లు ఆర్టీసీ అధికారులకు విన్నపం చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పోలీస్‌లు వచ్చి నచ్చజెప్పడంతో విరమించారు.

April 9, 2025 / 04:13 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

KDP: పేద కుటుంబాలు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కడప నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.8,35,192 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని తెలియజేశారు.

April 9, 2025 / 04:12 PM IST

‘సీఎం అర్ఎఫ్ పేదలకు ఒక వరం’

NDL: సీఎం సహాయ నిధి పేదలకు ఒక వర్గం లాంటిదని నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య అన్నారు. పాముల పాడు మండల, ఇస్కాలకు చెందిన నాగమణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 23, 920 సంబంధించిన చెక్కును ఆయన బుధవారం అందజేశారు. కన్వీనర్ రవీంద్ర రెడ్డి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

April 9, 2025 / 03:58 PM IST

‘మహాసభలను విజయవంతం చేయాలి’

KRNL: మే 15వ తేదీ నుంచి 18 వరకు తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నక్కీ లెనిన్ బాబు అన్నారు. కర్నూలులోని సీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

April 9, 2025 / 02:51 PM IST

తీవ్ర దుమారం రేపుతున్న జగన్ వ్యాఖ్యలు

AP: పాపిరెడ్డిపల్లిలో నిన్న మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎంగా పని చేసిన జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. పోలీస్ శాఖలో 5వేల మంది మహిళలు ఉన్నారని, గుడ్డలిప్పదీస్తామనడం సమంజసం కాదని మండిపడ్డారు.

April 9, 2025 / 02:23 PM IST

జిల్లాకు 225 పశువుల షెడ్లు మంజూరు

KRNL: ఉపాధి నిధులతో తాజాగా 225 పశువుల షెడ్ల నిర్మాణాలకు కలెక్టర్ రంజిత్ భాషా అనుమతులు ఇచ్చినట్లు జిల్లా నీటి యాజమాన్య PD వెంకటరమణయ్య బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 1,245 షెడ్లు, మంజూరుకాగా, 91శాతం షెడ్ల పనులు మొదలయ్యాయన్నారు. వేసవిలో పశువుల కోసం 358పశువులతొట్లు మంజూరు కాగా, ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.34 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

April 9, 2025 / 01:36 PM IST

ప్రపంచ ఎకానమీ అనిశ్చితి ఎదుర్కొంటోంది: RBI

ప్రపంచ ఆర్థిక దృక్పథం వేగంగా మారుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘ప్రస్తుత వాణిజ్య చర్యలు అనిశ్చితులను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్త పరిస్థితులు రూపాయిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థిరత్వం సాధించేందుకు ద్రవ్య పరపతి విధానం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు. 

April 9, 2025 / 11:26 AM IST

మరో 3 రోజులు ఆస్పత్రిలోనే పవన్‌ కుమారుడు

AP: అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని తన కుమారుడిని పరామర్శించారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా ఇబ్బందులు తలెత్తాయని.. మరో 3 రోజులు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్‌కు వైద్యులు తెలిపారు.

April 9, 2025 / 11:19 AM IST

వడగండ్ల వాన.. పంట నేలమట్టం

BDK: చండ్రుగొండ మండలం బాలికుంట గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు పలు రకాల పంటలు నేలమట్టమయ్యాయి. వేలాది రూపాయలు పెట్టుబడులతో సాగు చేసిన పంటలు దెబ్బతినటంతో సదరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

April 9, 2025 / 11:15 AM IST

‘తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయండి’

KRNL: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 14న ఎమ్మిగనూరులోని తహాసీల్దార్ కార్యాలయ ఆవరణలో తలసేమియా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయాలని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కదిరికోట ఆదెన్న, జి. ఆనంద్ చైతన్య మాదిగలు బుధవారం తెలిపారు. రక్తదానం చేసి మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు.

April 9, 2025 / 11:10 AM IST

వైసీపీ వాళ్లు కావాలనే చేశారు: అనిత

AP: YCP నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ వస్తున్నారు.. ఎక్కువ మంది రావాలంటూ.. వారి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టుకున్నారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే YCP నాయకులు హెలిప్యాడ్‌పై దాడి చేశారని విమర్శించారు. ఈ క్రమంలో పోలీసులకూ గాయాలయ్యాయన్నారు. ఓ క్రిమినల్ పాలిటిక్స్‌లో ఎలా ఉంటారో.. జగనే ఉదాహరణ అని మండిపడ్డారు.

April 9, 2025 / 11:09 AM IST