KNR: గన్నేరువరం మండలంలోని కొండాపూర్లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం “డ్రై డే ఫ్రైడే” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి చెత్తను తొలగించారు. వర్షాల వల్ల నిల్వ నీటిలో దోమలు పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సర్పంచ్ అజయ్ వర్మ తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులను కోరారు.
సత్యసాయి: తాడిమర్రి ప్రాథమిక వ్యవసాయ సహాయక పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా కునుకుంట్ల వడ్డీ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు రైతులకు చేరవేయడంలో వారధిగా నిలవాలని మంత్రి సూచించారు.
PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 9 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. రెండు కేంద్రాలలో 452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 443 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు వారు వివరించారు.
NLG: నకిరేకల్లోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ, భక్తులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సాయిబాబా ఆలయ కమిటీ ఛైర్మన్గా ఎన్నికైన తనుకునూరి శ్రీనివాస్, కమిటీసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారిని అభినందించారు. ఆలయంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు.
VKB: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ అన్నారు. కుల్కచర్ల మండలంలోని ఏకశిలా పర్వత శ్రీపాంబండ రామలింగేశ్వర స్వామిని ఆయన ఇవాళ దర్శించుకున్నారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు దైవదర్శనం ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మహిపాల్ రెడ్డి, అర్చకులు, పోలీసులు పాల్గొన్నారు.
NLG: మునుగోడు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు లింకు రోడ్లతో కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో రూ. 1.75 కోట్ల వ్యయంతో చెలిమెడ నుండి బొత్తలగడ్డ వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు.
SRPT: మోతే మండలం తుమ్మలపల్లి గ్రామం నుంచి నడిగూడెం మండలం కేశవాపురం వెళ్లే ప్రధాన రహదారి మట్టి రోడ్డుతో ప్రజలు, రైతులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రాకపోకలకు ఈ మార్గాన్ని ఉపయోగించి వారికి ప్రయాణం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
AP: CM చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు హాజరుకాలేకపోయారు. అనారోగ్యంతో హోమంత్రి అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, TG భరత్ ఈ సమావేశానికి రాలేదు. రేపటి జనసేన ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉండి Dy.CM పవన్, మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశంలో పాల్గొనలేదు. మంత్రి ఫరూక్ తన భార్య సంవత్సరీకం కారణంగా రాలేకపోయినట్లు సమాచారమిచ్చారు.
NLG: చెస్ ద్వారా చదువుపై ఏకాగ్రత, చురుకుదనం, దృష్టి పెరుగుతాయని జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెస్ ఒక ఆట మాత్రమే కాదని, దీని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అన్నారు.
ATP: గుత్తి మండలంలో ఈ నెల 16 నుంచి జరిగే టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి గౌతమ్ యాదవ్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.
VZM: గజపతినగరం వైసీపీ పరిశీలికురాలిగా మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ శోభా స్వాతీ రాణి ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్బంగా వైసీపీ సీనియర్ నాయకురాలు శోభా హైమావతితో కలిసి శుక్రవారం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనువాసరావును ధర్మపురిలోని తమ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చిన్నశ్రీను స్వాతి రాణికి సూచించారు.
JNG: చిల్పూర్ గుట్ట దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా పొట్లపల్లి శ్రీధర్ రావు, ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
BDK: కరకగూడెం మండలంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారిని డీఎస్పీ రవీందర్ రెడ్డి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మండలంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ పై యుద్ధం, శాంతి భద్రతల వంటి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి నరేందర్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ADB: అందరికీ ఆదర్శ మహిళ మొల్ల మాంబా అని ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామ సర్పంచ్ రేణుక అన్నారు. మొల్ల మాంబ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం లక్కారం కుమ్మరి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మొల్ల మాంబ తెలుగులో మొదటి రచయిత్రి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.