TPT: మహాకవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్ల తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కుమార్ సహా అధికారులు పాల్గొన్నారు.
KMM: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమలరాజు విమర్శించారు. శుక్రవారం చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
PDPL: పెద్దపల్లి మండలం చికురాయి గ్రామ రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు అధిక మోతాదులో యూరియా వాడకుండా నానో యూరియా వినియోగం పెంచాలని జిల్లా సహకార అధికారిణి శ్రీమాల సూచించారు. IFFCO ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నానో యూరియా ప్రయోజనాలను వివరించారు.
GDWL: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణ తలంబ్రాలను పోస్టల్ శాఖ ద్వారా బుక్ చేసుకోవచ్చని అయిజ సబ్ పోస్టు మాస్టర్ ప్రశాంత్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోస్ట్ ఆఫీసులో బుకింగ్ ప్రారంభమైంది. రూ.151కు ముత్యాల తలంబ్రాలు, రూ.450కు అంతరాలయ అర్చన తలంబ్రాలు పొందే అవకాశం ఉందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాడుతున్న 31 సెంటర్లను గుర్తించి, మొత్తం 68 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
TG: రంగారెడ్డి జిల్లా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమకు స్టైఫండ్ పెంచాలంటూ రెండ్రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో క్యాంటీన్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ASR: పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ప్రజా వేదిక నిర్వహించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను సావధానంగా విని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల వినతులను సంబంధిత శాఖలకు పంపించారు.
KRNL: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో తగిన వసతులు కల్పించాలని AISF జిల్లా ఉపాధ్యక్షుడు S. ఈరేష్, మండల కార్యదర్శి సాయి వర్మ డిమాండ్ చేశారు. కౌతాళం MEO శోభారాణికి వినతిపత్రం అందజేశారు. ఎండల దృష్ట్యా చల్లని త్రాగునీరు, ఫ్యాన్లు, సరిపడా వెలుతురు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ORSప్యాకెట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు ఎస్ఓ మీనాక్షి హాల్ టికెట్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించిన విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు. పరీక్షలు అంటే భయం వీడి ధైర్యంగా పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలిపారు.
W.G: ఉండి నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఎంతో కృషి చేస్తున్నారని ఆకివీడులోని TDP ముస్లిం పెద్దలు స్పష్టం చేశారు. స్థానిక TDP కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కొంతమంది కావాలని డిప్యూటీ స్పీకర్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పంట కాలవలపై ఉన్న అక్రమణలు మాత్రమే తొలగించారని, మసీదులు అభివృద్ధికి ఆయన సాయపడ్డారని తెలిపారు.
వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం తరఫున జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రేపు స్టార్ ఫంక్షన్ హాల్ నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
SRCL: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం పిల్లల తల్లులతో మాట్లాడారు.
TG: అంత్యోదయ కార్డులు ఉన్న లబ్దిదారులకు అవసరమైన రేషన్ బియ్యం ఇవ్వాల్సిందేనని అధికారులు తెలిపారు. అలా ఇవ్వని రేషన్ షాపులపై వేటు వేస్తామని హెచ్చరించారు. కాగా, అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 35 కేజీల బియ్యం ఇస్తారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం, HOD టవర్ల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మెకానికల్ పనుల కోసం రూ.2,316 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. అమరావతి అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి సృష్టి, వ్యవసాయం, విద్యుత్, పర్యాటకంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే, CRDA నిర్ణయాలను ఆమోదించింది.
KNR: పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన ఎల్పీజీ కొరత ప్రభావం విద్యా సంస్థలపై పడకుండా చూడాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లకు వంటగ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో భోజనం అందేలా చూడాలన్నారు.