TG: BRS పాలన నుంచి మార్పు కోరుకుని ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్లో మాట్లాడిన ఆయన.. ‘హమీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. ప్రభుత్వంపై రైతులు, ఉద్యోగులు, యువత వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్, BRSను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మూడు MLC స్థానాల్లో BJP పోటీ చేస్తుంది. అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది’ అని తెలిపారు.
KMM: కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ప్రజలు చికెన్ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆదివారం అయినా వైరా మున్సిపాలిటీలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. అసత్య ప్రచారం మానుకోవాలని, దీని వల్ల తమ వ్యాపారానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని చికెన్ షాప్ యాజమానులు మండిపడ్డారు. అలాగే ప్రజలు చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
GNTR: బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. కేజీ చికెన్ రూ. 140, రూ.160ల బోర్డులు పెట్టినా కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. ఇదే అదునుగా చేపలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చేపల మార్కెట్, మిర్చియార్డు, ఆర్టీవో ఆఫీస్ రోడ్, పొన్నూరు రోడ్డు, అమరావతి రోడ్డు ప్రాంతాల్లోని ఆదివారం మాత్రమే దుకాణాలు కళకళలాడుతుంది.
W.G: తణుకు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో కోడి మాంసం అమ్మకాలు లేకుండా దుకాణాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లో చేపలకు, రొయ్యలకు, మటన్కు భారీ డిమాండ్ పెరిగింది. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు ఆయా దుకాణాల వద్ద క్యూలు కడుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని దుకాణ యజమానులు ధరలు పెంచేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు
GNTR: సమకాలీన సమాజంలో కీలకమైన భాగంగా కృత్రిమ మేధస్సు (AI) ఉద్భవించిందని.. మానవ ఉనికి విభిన్న కోణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు అన్నారు. విశ్వవిద్యా లయంలో విద్యార్థులకు ఏఐపై 2 రోజులుగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించామన్నారు. హైదరాబాద్లోని వర్ధన్ డేటా సైన్స్ అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పాల్గొన్నారు.
WPL-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా మొత్తం ఈ సీజన్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని RCB యాజమన్యం ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో స్నేహ రాణా జట్టులోకి తీసుకుంది. స్నేహ గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. అయితే ఈ సారి వేలంలో ఆమెను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతు సత్తయ్య తెలిపారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు ఆ కేంద్రంలో నమోదు చేయించుకోవచ్చన్నారు.
HYD: HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి. వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం అన్నారు. చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయ్యాలన్నారు.
E.G: బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగంతోపాటు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు రూ.4.90లు పలికిన గుడ్డు ధర ఇప్పుడు రూ.4.55లకు పడిపోయింది. ఈ ప్రభావం కేక్లపై కూడా పడింది. చాలామంది కేక్లు తినేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా, స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది.
HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ చేదువార్త తెలిపింది. సికింద్రాబాద్-నాగపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 కోచ్లతో నడుస్తుండగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 8 కోచ్లకు కుదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి సగం సీట్లు కూడా నిండకపోవడమే కారణం అన్నారు.
GNTR: నగరానికి చెందిన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీ ముగియడంతో నార్సింగ్ పోలీసులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్కి బానిసలుగా మార్చి యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి నగ్న వీడియోలు తీసిన కేసులో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు మస్తాన్ సాయి సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు శనివారం జారీ చేశారు. గత కొంతకాలంగా పాఠశాల విద్యార్థులు ఎదుట దైవ దూషణ చేయడం, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఎంఈఓ రాముడు డీఈఓకు అందజేశారు. అనంతరం విచారణ జరిపి షోకాజ్ ఇచ్చినట్లు తెలిపారు.
W.G: నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ కె.శైలజ శనివారం తెలిపారు. మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 5,6,7,8,9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు
GNTR: బెల్లంకొండ చండ్రాజుపాలెం NSP కాలువలో 3వ పెద్ద డ్రాపు వద్ద మొసలి సంచరిస్తున్నట్లు పలువురు చూడటంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతపల్లి మేజర్ కాలువలో మొసళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈకాలువలో పాడి రైతులు పశువులను కడుగుతారని, యువకులు స్నానాలు చేస్తుంటారని అన్నారు. ఏప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మేడ్చల్: కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని 6 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. HYDలోని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ HYD జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, SEC రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం RTC ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి బస్టాప్ సిద్ధం అయింది అని తెలిపారు.