KMR: రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిపించాలని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. బీంగల్-కామారెడ్డి ప్రధాన రహదారిపై మద్దికుంట మర్రివద్ద డ్వాక్రా సంఘాలు, కాలేజీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఎన్నిసార్లు ఆర్టీసీ అధికారులకు విన్నపం చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పోలీస్లు వచ్చి నచ్చజెప్పడంతో విరమించారు.
KDP: పేద కుటుంబాలు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కడప నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.8,35,192 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని తెలియజేశారు.
NDL: సీఎం సహాయ నిధి పేదలకు ఒక వర్గం లాంటిదని నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య అన్నారు. పాముల పాడు మండల, ఇస్కాలకు చెందిన నాగమణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 23, 920 సంబంధించిన చెక్కును ఆయన బుధవారం అందజేశారు. కన్వీనర్ రవీంద్ర రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
KRNL: మే 15వ తేదీ నుంచి 18 వరకు తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నక్కీ లెనిన్ బాబు అన్నారు. కర్నూలులోని సీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
AP: పాపిరెడ్డిపల్లిలో నిన్న మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎంగా పని చేసిన జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. పోలీస్ శాఖలో 5వేల మంది మహిళలు ఉన్నారని, గుడ్డలిప్పదీస్తామనడం సమంజసం కాదని మండిపడ్డారు.
KRNL: ఉపాధి నిధులతో తాజాగా 225 పశువుల షెడ్ల నిర్మాణాలకు కలెక్టర్ రంజిత్ భాషా అనుమతులు ఇచ్చినట్లు జిల్లా నీటి యాజమాన్య PD వెంకటరమణయ్య బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 1,245 షెడ్లు, మంజూరుకాగా, 91శాతం షెడ్ల పనులు మొదలయ్యాయన్నారు. వేసవిలో పశువుల కోసం 358పశువులతొట్లు మంజూరు కాగా, ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.34 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచ ఆర్థిక దృక్పథం వేగంగా మారుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘ప్రస్తుత వాణిజ్య చర్యలు అనిశ్చితులను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్త పరిస్థితులు రూపాయిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థిరత్వం సాధించేందుకు ద్రవ్య పరపతి విధానం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.
AP: అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని తన కుమారుడిని పరామర్శించారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా ఇబ్బందులు తలెత్తాయని.. మరో 3 రోజులు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్కు వైద్యులు తెలిపారు.
BDK: చండ్రుగొండ మండలం బాలికుంట గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు పలు రకాల పంటలు నేలమట్టమయ్యాయి. వేలాది రూపాయలు పెట్టుబడులతో సాగు చేసిన పంటలు దెబ్బతినటంతో సదరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
KRNL: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 14న ఎమ్మిగనూరులోని తహాసీల్దార్ కార్యాలయ ఆవరణలో తలసేమియా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయాలని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కదిరికోట ఆదెన్న, జి. ఆనంద్ చైతన్య మాదిగలు బుధవారం తెలిపారు. రక్తదానం చేసి మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు.
AP: YCP నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ వస్తున్నారు.. ఎక్కువ మంది రావాలంటూ.. వారి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకున్నారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే YCP నాయకులు హెలిప్యాడ్పై దాడి చేశారని విమర్శించారు. ఈ క్రమంలో పోలీసులకూ గాయాలయ్యాయన్నారు. ఓ క్రిమినల్ పాలిటిక్స్లో ఎలా ఉంటారో.. జగనే ఉదాహరణ అని మండిపడ్డారు.
KMM: స్వాతంత్య్ర సమరయోధులు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 31 వ వర్ధంతి సందర్భంగా.. బుధవారం ఖమ్మం పార్టీ కార్యాలయం గిరి ప్రసాద్ భవన్లో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ.. చంద్ర రాజేశ్వరరావు ఆదర్శ కమ్యూనిస్టు అని కొనియాడారు.
KMM: కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి గ్రామ శివారు ఉడతలగూడెం గ్రామంలో బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయానికి గ్రామస్తులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ నిర్మాణ పరిసర ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ అర్చకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
కృష్ణా: ఇబ్రహీంపట్నంలో గతేడాది కృష్ణా నది వరదల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఏపీసీపీడీసీఎల్ లైన్మెన్ కోటేశ్వరరావు కుటుంబానికి బ్యాంక్ అధికారులు రూ.28లక్షల బీమా చెక్కును అందజేశారు. డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుడి భార్య మాధవీలతకు బ్యాంక్ మేనేజర్ మునీర్, ఏపీసీపీడీసీఎల్ డీఈ వసంతరావు చెక్కు అందించారు.