MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని దండేపల్లి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ సూచించారు. దండేపల్లిలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న మొదటి దశ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ పరిపాలన, విధులు, నిధులు, గ్రామ సభ తీర్మానాలు, తదితర వాటిపై అవగాహన కల్పించారు.