• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘స్థలాల కేటాయింపుపై చర్యలు తీసుకుంటాం’

శ్రీకాకుళం: నగరంలోని పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా షాపులు ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్న ఇటీవల ఆదేశించారు. దీంతో వ్యాపారులంతా బుధవారం ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. స్థలాలు కేటాయింపుపై చర్యలు తీసుకుంటామన్నారు.

April 9, 2025 / 05:06 PM IST

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: సీతంపేట మండల రేగులగూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సవర లక్ష్మణరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పాలకొండ ఎమ్మెల్యే జయక్రిష్ణ కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. వారికి స్వయంగా కొంత ఆర్ధిక సహాయం చేశారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించుటకు తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.

April 9, 2025 / 05:06 PM IST

పంటలను పరిశీలించిన ఏఈవో

KMR: మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ గ్రామంలో బుధవారం ఏఈవో రేణుక వరి పంటను పరిశీలించారు. వరి పంటలో దోమపోటు ఉధృతిని గమనించారు. రైతులు దోమపోటు నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు నిర్వహించి, ఎకరానికి బుఫ్రోఫెసిన్ 320 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 120 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకోవాలని సూచించారు.

April 9, 2025 / 04:57 PM IST

రామయ్యను దర్శించుకున్న ఎస్పీ

W.G: భీమవరం పోలీస్ క్వార్టర్స్‌లోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా అద్నాన్ నయీం అస్మి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం నిరుపేదలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జయ సూర్య పాల్గొన్నారు.

April 9, 2025 / 04:54 PM IST

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా: నిగార్ సుల్తానా

అన్నమయ్య: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని మదనపల్లెకు చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తానన్నారు.

April 9, 2025 / 04:51 PM IST

తిరుపతికి విచ్చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు

TPT: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుస్సాలువతో సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 9, 2025 / 04:48 PM IST

రీ సర్వేపై అవగాహన కల్పించిన ఆర్డీఓ

తూ.గో: పాతపట్నం మండలం గంధం సరియా, గురండి గ్రామాల్లో బుధవారం రీ సర్వే కార్యక్రమం రెండవ విడత జరిగింది. గ్రామాలలో రాబోయే రెండు నెలల కాలంలో రైతుల సమక్షంలో భూముల సర్వే నిర్వహిస్తారని తహసీల్దార్ తెలిపారు. అందులో భాగంగా గురండి గ్రామంలో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించుటకు నిర్వహించిన గ్రామ సభ, ర్యాలీలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

April 9, 2025 / 04:26 PM IST

ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్‌: ఎమ్మెల్యే

శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్‌ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

April 9, 2025 / 04:24 PM IST

బ్రహ్మోత్సవాలకు 13 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు: CI

KDP: ఏప్రిల్ 11న ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా 13 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీఐ బాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కడప- చెన్నై జాతీయ రహదారి ఉప్పరపల్లె పంచాయతీ సాయిబాబా గుడి సమీపంలో కారు, బస్సు, ద్విచక్ర వాహనాల తదితర వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని ఆయన సూచించారు.

April 9, 2025 / 04:24 PM IST

మెడల్ సాధించిన క్రీడాకారిణిని సన్మానించిన ఎమ్మెల్యే

HNK: ఇటీవల జరిగిన కేలో ఇండియా యూత్ గేమ్స్ నేషనల్ & ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో ఫెన్సింగ్ స్పోర్ట్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన శ్రీజను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మెడల్ అందజేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.

April 9, 2025 / 04:24 PM IST

బస్సు కోసం రాస్తారోకో

KMR: రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిపించాలని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. బీంగల్-కామారెడ్డి ప్రధాన రహదారిపై మద్దికుంట మర్రివద్ద డ్వాక్రా సంఘాలు, కాలేజీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఎన్నిసార్లు ఆర్టీసీ అధికారులకు విన్నపం చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పోలీస్‌లు వచ్చి నచ్చజెప్పడంతో విరమించారు.

April 9, 2025 / 04:13 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

KDP: పేద కుటుంబాలు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కడప నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.8,35,192 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని తెలియజేశారు.

April 9, 2025 / 04:12 PM IST

‘సీఎం అర్ఎఫ్ పేదలకు ఒక వరం’

NDL: సీఎం సహాయ నిధి పేదలకు ఒక వర్గం లాంటిదని నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య అన్నారు. పాముల పాడు మండల, ఇస్కాలకు చెందిన నాగమణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 23, 920 సంబంధించిన చెక్కును ఆయన బుధవారం అందజేశారు. కన్వీనర్ రవీంద్ర రెడ్డి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

April 9, 2025 / 03:58 PM IST

‘మహాసభలను విజయవంతం చేయాలి’

KRNL: మే 15వ తేదీ నుంచి 18 వరకు తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నక్కీ లెనిన్ బాబు అన్నారు. కర్నూలులోని సీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

April 9, 2025 / 02:51 PM IST

తీవ్ర దుమారం రేపుతున్న జగన్ వ్యాఖ్యలు

AP: పాపిరెడ్డిపల్లిలో నిన్న మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎంగా పని చేసిన జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. పోలీస్ శాఖలో 5వేల మంది మహిళలు ఉన్నారని, గుడ్డలిప్పదీస్తామనడం సమంజసం కాదని మండిపడ్డారు.

April 9, 2025 / 02:23 PM IST