ప్రకాశం: గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ నిషా కుమారి అడవికి నిప్పు పర్యావరానికి ముప్పు అనే శీర్షికతో అడవులపై అవగాహన కల్పించే గోడపత్రాన్ని విడుదల చేశారు. ఎండాకాలం సమీపిస్తున్న సమయంలో అడవులలో ఎండు గడ్డి రాలుతుందని పొరపాటున కూడా నిప్పు పెట్టరాదు అన్నారు. అడవికి నిప్పు పెడితే గ్రామాల వరకు వ్యాపించి పర్యావరణానికి మానవులకు ముప్పు కలుగుతుంది.
ప్రకాశం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఒంగోలులోని రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాల చోదనలో ఎక్కువమంది నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు.
PPM: జిల్లాలో గృహాల నుంచి సేకరిస్తున్న చెత్త నుంచి సంపదను సృష్టించే దానిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి, వర్మి కంపోస్టుల ద్వారా సంపద సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దీనికి ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యత వహించాలని కలెక్టర్ సూచించారు.
KMR: పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.
VZM: జిల్లాలో కౌలు కార్డు కలిగిన ప్రతి కౌలు రైతుకు రుణాలు మంజూరు చేయించే లక్ష్యమని కలెక్టర్ అంబేద్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం ఇప్పటికే ఫిబ్రవరి 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. 126 మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చామన్నారు.
VZM: APSRTC విజయనగరం డిపోలో శనివారం రోడ్డు బధ్రతా మాసోత్సవాల ముగింపు సభను నిర్వహించారు. సందర్భముగా DPTO సీహెచ్.అప్పలనారాయణ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం, ఎస్. కోట డిపోలో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్స్గా ప్రతిభ కనపరిచిన డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందచేశారు.
TG: బీసీల కోసం ప్రధాని మోదీ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఓబీసీ అంటూ ప్రచారం చేసుకున్నారే తప్ప వాళ్లకు చేసిందేమీ లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలను హైరానా చేస్తున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ పుట్టుకతో బీసీ, మరి మోదీ ఎవరు? అని ప్రశ్నించారు. పుట్టుకతో మోదీ బీసీ కాదు.. లీగల్గా బీసీకి మారారంటూ ఆరోపించారు.
TG: ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై CM రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మోదీని ఎక్కడా కించపరచలేదని తెలిపారు. అలాగే SC వర్గీకరణ, కులగణనపై రాహుల్తో చర్చించానని, PCC కార్యవర్గం, కేబినెట్ విస్తరణపై చర్చించలేదన్నారు. వర్గీకరణపై చట్టం చేసిన తర్వాత సభ పెడుతామన్నారు. బడ్జెట్ సెషన్లో వర్గీకరణ బిల్లు తెస్తామని, ఉపకులాల విషయంలో కమిషన్ అధ్యయనం చేస్తుందన్నారు.
KKD: సీఎం చంద్రబాబును కాకినాడ జేఎన్టీయూ గ్రంథాలయ విభాగాధిపతి దొరస్వామి నాయక్ శనివారం కలిశారు. తనకు అన్ని అర్హతలు ఉన్నా కేవలం గిరిజనుడని ప్రొఫెసర్ హోదా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు దొరస్వామి తెలిపారు.
MNCL: తాండూర్ మండలం గోపాల్ నగర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో శనివారం పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ గోపికృష్ణ నిర్ధారించడం కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న మంచినీటి బావి వద్ద పులి పాదముద్రలను అధికారులు శనివారం గుర్తించారు. స్థానిక రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
HYD: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆరోపించారు. శనివారం విద్యానగర్ లోని బీసీభవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కన్వర్టెడ్ బీసీ అని సీఎం ప్రకటించారు.
కోనసీమ: నకిలీ వీసా మోసాలను అరికట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ను కలిశారు. ఈ మధ్య కాలంలో విదేశాల్లో పనుల పేరుతో దళారుల చేతుల్లో చాలా మంది మోసపోతున్నారని.. అమరావతిలో ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయనను కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ. 38,02,281 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లోని పంచాయతీలకు చెందిన చెత్తా చెదారాలను అమలాపురం డంప్ యార్డ్కు తరలించి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్, ఎంపీడీవోలు, EOPRDలతో ఆయన సమావేశం నిర్వహించారు.
KNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికే అఖండ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీశ్రేణులకు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ.నరేందర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.