PDPL: ఓదెల మండలం పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం సరిపడ వండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పాఠశాలలో సుమారు 50 మంది ఉండగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డామని వాపోయారు. ఈ విషయమై హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని బదులిచ్చినట్లు తెలుస్తోంది.
SKLM: నరసన్నపేట మండలం లుకలాంలో చింత చెట్టుపై నుంచి జారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. బొత్స శ్రీరాములు (52) మంగళవారం చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కింద పడ్డాడు. స్థానికులు గమనించి నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్లో అక్రమంగా ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి ఆరు కేజీల గంజాయి స్వాధీన పరుచుకొని రిమాండ్కి తరలించామని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ చెప్పారు. నాతవరం ఎస్సై భీమరాజుకు ముందస్తు సమాచారంతో బస్సుని ఆపడంతో నిందితులు పారిపోతుండగా సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
JGL: ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం.
AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం గ్రామానికి చెందిన వికలాంగుడు మజ్జి రమేశ్కు న్యాయం చేయాలని ఎంపీపీ గజ్జలపు మణికుమారి కోరారు. మంగళవారం తహశీల్దార్ పి.శ్రీనివాసరావును కలిశారు. ఎంపీపీ మాట్లాడుతూ.. రమేశ్ తండ్రి మజ్జి నూకన్న ఇంటి స్థలం యొక్క ప్లాట్ నెంబరు 35 ప్రకారం కేటాయించిన స్థలంను వరుస క్రమంలో సరి చేసి ఇప్పించి వికలాంగుడికి న్యాయం చేయాలన్నారు.
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడని ఈ నెల 3వ తేదీ ప్రేమికుడిని కొట్టి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడి చేసి వృద్ధురాలిని హత్య చేశారని తెలిపారు.
GNTR: పొన్నూరు నిడుబ్రోలు వద్ద విషాదం జరిగింది. భార్య మృతిని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మరణించిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి అన్నవరపు ఆశీర్వాదం(85), భార్య సామ్రాజ్యం(76) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. సోమవారం రాత్రి సామ్రాజ్యం మృతిచెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆశీర్వాదం మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.
GNTR: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు అందింది. గుంటూరు కొరిటిపాడుకు చెందిన ఎలిజాల శిరీష (25) మానసిక స్థితి బాగోలేక 7వ తేదీన ఇంట్లో చెక్క దూలానికి చున్నీతో ఉరి వేసుకొని చనిపోయిందని తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పర్యటన వివరాలను ఆ పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు జి.సిగడాం మండలంలోని గెడ్డకంచారంలో ‘నమస్తే ఎచ్చెర్ల – మన ఊరికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, స్థానికులు, ప్రజలు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.
కృష్ణా: నందిగామ పట్టణంలో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నందిగామ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఈ కార్యక్రమానికి నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు సమస్యలను లిఖితపూర్వకంగా అందించాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
KRNL: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాల్లో, ఒక్క రోజులోనే లక్షకు పైగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించారు. దీంతో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కిందని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు పేర్కొన్నారు.
TG: ఈ ఏడాది పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత పత్తి సీజన్కు సంబంధించి మార్చి 31 వరకు జరిగిన ప్రత్తి కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్ల సేకరణను నమోదు చేసిందని టెక్స్టైల్స్ శాఖ తెలిపింది. ఆ తర్వాత 30 లక్షల బేళ్లతో మహారాష్ట్ర, 14 లక్షల బేళ్లతో గుజరాత్ ఉన్నాయని పేర్కొంది.
VZM: నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లతో కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపన్ను, పీజీఆర్ఎస్, రీసర్వే రెండవ దశ పై మండ...
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వచ్చింది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజాదర్బారును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి: తొర్రూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, మెట్రో వాటర్, సివిల్ సప్లై, RWS R&B అధికారులతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సమస్యలపై మాట్లాడి త్వరగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.