KMM: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమలరాజు విమర్శించారు. శుక్రవారం చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.