TPT: హైదరాబాద్కు చెందిన పెరి రాధిక టీటీడీకి విరాళంగా రూ.10 లక్షలు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్కు ఇచ్చారు. చెక్ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేయగా, ఆయన దాత కుటుంబానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.