MNCL: పాఠశాలకు, విద్యార్థికి విడదీయలేని అనుబంధం ఉంటుందని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అన్నారు. జన్నారం మండలంలోని పోన్కల్ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ చదువుకునే దశ అందరికీ తీపి జ్ఞాపకాలను మిగులుస్తుందన్నారు.