SKLM: రణస్థలం ఎమ్మార్వో కార్యాలయం నుంచి వేణు గోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు నిర్మాణ పనులు రూ.1.50 కోట్లతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ పనులను ఎమ్మెల్యే ఈశ్వరరావు పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.