NDL: నంద్యాల జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ శనివారం తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించబడతాయి. జిల్లాలోని 130 కేంద్రాల్లో 25,035 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు.