HYD: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆరోపించారు. శనివారం విద్యానగర్ లోని బీసీభవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కన్వర్టెడ్ బీసీ అని సీఎం ప్రకటించారు.
కోనసీమ: నకిలీ వీసా మోసాలను అరికట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ను కలిశారు. ఈ మధ్య కాలంలో విదేశాల్లో పనుల పేరుతో దళారుల చేతుల్లో చాలా మంది మోసపోతున్నారని.. అమరావతిలో ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయనను కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ. 38,02,281 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: అమలాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లోని పంచాయతీలకు చెందిన చెత్తా చెదారాలను అమలాపురం డంప్ యార్డ్కు తరలించి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్, ఎంపీడీవోలు, EOPRDలతో ఆయన సమావేశం నిర్వహించారు.
KNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికే అఖండ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీశ్రేణులకు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ.నరేందర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కోనసీమ: జిల్లాలో బర్డ్ ఫ్లూపై కలెక్టరేట్లో శనివారం పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయన్నారు. వాటిలో 24 లక్షల కోళ్లు ఉన్నాయని తెలిపారు. 41 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
SRCL: యువత మేలుకో అంటూ సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు.
SRCL: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వేములవాడ ప్యాక్స్ డైరెక్టర్ తోట రాజు కృతజ్ఞతలు తెలిపారు.
SRCL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పోలీసులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచ వచ్చన్నారు.
ASR: 516 జాతీయ రహదారి విస్తరణలో పాడేరు మోదకొండమ్మ ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని పెసా కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ, బోనంగి రామన్న శనివారం కోరారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో విస్తరణలో మోదకొండమ్మ ఆలయం కొంతభాగం పోతుందని తమకు సమాచారం ఉందన్నారు. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో హమాస్ మరో ముగ్గురు బందీలను విడుదల చేసి రెడ్క్రాస్కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36), అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)ను విడుదల చేసినట్లు తెలిపారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ.. బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రముఖ హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి పీటలెక్కారు. ప్రియుడు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్తో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. కాగా, ప్రియా బెనర్జీ.. తెలుగులో జోరు, కిస్ తదితర సినిమాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించారు.
వినియోగదారులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునేవారికి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను తగ్గించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. RBI రెపో రేటును 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు SBI తెలిపింది.
TG: ఎనిమీ ప్రాపర్టీస్ లెక్క తేల్చాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. భారత్ నుంచి వెళ్లి పాక్, చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై సమీక్ష సందర్భంగా కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చించారు. కొత్తగూడెం, వికారాబాద్, HYD, రంగారెడ్డిలోని ఆస్తులపై మార్చిలోపు లెక్కలు తేల్చాలని చెప్పారు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
KNR: పీఎం మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్తురాలు. ఇక రాహుల్ గాంధీకి కులం లేదు.. మతం, జాతి, దేశం లేదు. రాహుల్ కులంపై రేవంత్ ఏం సమాధానం చెప్తారు అని ఎద్దేవా చేశారు.