TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్ ల వద్ద సమగ్ర ఏర్పాటు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడు, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్ ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉంటుందని పేర్కొన్నారు.
JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఘన్పూర్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ATP: రంజాన్ మాసం చివరి జుమా సందర్భంగా గుత్తి కేబీఎన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదు ఇమామ్ హుస్సేన్ ఉపవాసం, దానధర్మాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పవిత్ర మాసంలో చేసే నమాజ్, సత్కారాలకు అధిక పుణ్యం లభిస్తుందని వివరించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నమాజ్ పూర్తి చేసి ప్రత్యేక దువా నిర్వహించారు.
ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ డిపోలోని డ్రైవింగ్ కాలేజీలో ఆసక్తి గల నిరుద్యోగులకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయానా బేగం తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. శిక్షణ కోర్సు ఫీజు రూ.20,000తో పాటు జీఎస్టీ రూ.3,600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కృష్ణా: ఉయ్యూరు మండలం కాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన కళావేదికను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన కాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామస్తుల సహకారంతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
MBNR: మహబూబ్ నగర్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మైసూర్ ఉత్తరాది దత్త పీఠాధిపతి శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ స్వామీజీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామీజీకి శేషవస్త్రంతో ఘనంగా సన్మానం చేశారు.
GDWL: రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ కాసపోగు బేబి సునీల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఉగాది పండుగ, దస్తగిరయ్య-గోకరమయ్య ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రారంభించినట్లు తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక, గ్రామంలో ఐక్యతను పెంచుతాయని సర్పంచ్ పేర్కొన్నారు.
GNTR: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్. చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు.
PPM: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులలో కనీస విద్యా సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్థానిక డివిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుల స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు.
వనపర్తి: విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలో రాసేలా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శుక్రవారం రేపటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాల మొత్తం 7212 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయి. అవుట్పుట్ చూశాక OTT భాగస్వాములు విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. పీరియడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
TPT: హైదరాబాద్కు చెందిన పెరి రాధిక టీటీడీకి విరాళంగా రూ.10 లక్షలు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్కు ఇచ్చారు. చెక్ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేయగా, ఆయన దాత కుటుంబానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
KMM: చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని, బాటసారులు దాహార్తిని తీర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపల మడుగు వీరబాబు అన్నారు. శుక్రవారం చింతకాని మండలం తిర్లాపురం గ్రామంలో ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద అన్న – తమ్ముడు సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేద్రంను సర్పంచ్ ప్రారంభించారు.
E.G: ప్రజలు విన్నవించిన అన్ని సమస్యలకు తాము పరిష్కారం చూపిస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని 2వ డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మీ భద్రత మా బాధ్యత మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ. 1,900 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ. 9,350, పచ్చి పల్లికాయకు రూ. 4,000 ధర వచ్చింది. పసుపు క్వింటాకి రూ. 10,709 ధర వస్తే.. 5,531 రకం మిర్చి రూ. 21 వేలు, సింగల్ పట్టి మిర్చి రూ. 44 వేలు ధర పలికాయని వ్యాపారులు తెలిపారు.