NDL: పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ రఫీ నేడు ఉ. 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నంది కోట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గ్రామానికి చేరుకుని రఫీ మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
NLG: మిర్యాలగూడలోని జనయేత్రీ సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షులు, సామాజిక సేవకులు, డా.మునీర్ అహ్మద్ షరీఫ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు పాల్గొని మాట్లాడుతూ.. ఒకరి రక్తదానం వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. యువత స్వచ్ఛంద రక్త దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
KRNL: కర్నూలును మెడికల్ హబ్గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
SKLM: జలుమూరు మండలం లచ్చన్నపేటలో ఎన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని ఉపాధ్యాయుడు ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చేపట్టిన ఈ డ్రైవ్లో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యబోధనలు అందిస్తున్నామన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ SHO దేవయ్య తెలిపారు. SHO మాట్లాడుతూ.. సర్వే నం. 170PP ఆక్రమించి ఇల్లు కడుతున్న SK. మహబూబ్ బీ, అమానుల్లా ఖాన్ అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేశామని SHOపేర్కొన్నారు.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత ఓవర్లలో 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తిలక్(52) హార్దిక్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో బెంగళూరు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
SRD: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తులను www.polycet.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SKLM: ఎచ్చెర్లలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం యూనిట్ 4 ప్రోగ్రాం ఆఫీసర్ డా.జి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లకు సర్వీస్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ చాలా ఉన్నతమైనదన్నారు. వాలంటీర్లు నాయకత్వపు లక్షణాలు నేర్చుకొని ప్రజల్లో చైతన్యం కలిగించవచ్చన్నారు.
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ZPHSలో వరల్డ్ హెల్త్ డే నిర్వహించారు. ఈ మేరకు ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత రక్త పరీక్షలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానిక లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు బ్లడ్ గ్రూప్, హిమగ్లోబిన్ రక్త పరీక్షలు చేశారు.
ELR: ఉంగుటూరు మండలం కాగుపాడు పంచాయతీ సర్పంచ్ కడియాల సుధేష్ణను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని వార్డు సభ్యుడు వంకిన మాధవరావు చేసిన కంప్లైంట్ ఆధారంగా అధికారులు విచారణ చేశారు. ఈ క్రమంలో సర్పంచును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. సిక్సర్తో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తీ చేసుకోవడం విశేషం. 10 ఓవర్లు ముగిసేసరికి RCB.. 100/2 పరుగులు చేసింది. పటీదార్ 3, కోహ్లీ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు.
VSP: ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఏస్డీపీలో రెండోస్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
SRPT: పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం నూతనకల్ మండలం బక్కా హేమ్లా తండాలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం దుప్పలవలస డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కళాశాల విద్యార్థులు ఈ నెల 5న విజయవాడలో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్ ఆధ్వర్యంలో 12వ జాతీయ చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 101 మంది విద్యార్థులపాల్గొనగా 20 మంది విద్యార్థులు బంగారు పతకాలు, 11 మంది సిల్వర్ పతకాలు సాధించారని ప్రిన్సిపల్ బుచ్చిబాబు తెలిపారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ. 1,07,953లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ. 38,730లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ. 22,830 ఆదాయం లభించిందన్నారు. అదేవిధంగా అన్నదానానికి విరాళాల ద్వారా రూ. 35,876లు, పంచామృతాభిషేకానికి రూ. 5516లు వచ్చాయన్నారు.