SRCL: యువత మేలుకో అంటూ సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు.
SRCL: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వేములవాడ ప్యాక్స్ డైరెక్టర్ తోట రాజు కృతజ్ఞతలు తెలిపారు.
SRCL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పోలీసులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచ వచ్చన్నారు.
ASR: 516 జాతీయ రహదారి విస్తరణలో పాడేరు మోదకొండమ్మ ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని పెసా కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ, బోనంగి రామన్న శనివారం కోరారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో విస్తరణలో మోదకొండమ్మ ఆలయం కొంతభాగం పోతుందని తమకు సమాచారం ఉందన్నారు. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో హమాస్ మరో ముగ్గురు బందీలను విడుదల చేసి రెడ్క్రాస్కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36), అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)ను విడుదల చేసినట్లు తెలిపారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ.. బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రముఖ హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి పీటలెక్కారు. ప్రియుడు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్తో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. కాగా, ప్రియా బెనర్జీ.. తెలుగులో జోరు, కిస్ తదితర సినిమాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించారు.
వినియోగదారులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునేవారికి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను తగ్గించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. RBI రెపో రేటును 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు SBI తెలిపింది.
TG: ఎనిమీ ప్రాపర్టీస్ లెక్క తేల్చాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. భారత్ నుంచి వెళ్లి పాక్, చైనాలో స్థిరపడిన వారి ఆస్తులపై సమీక్ష సందర్భంగా కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చించారు. కొత్తగూడెం, వికారాబాద్, HYD, రంగారెడ్డిలోని ఆస్తులపై మార్చిలోపు లెక్కలు తేల్చాలని చెప్పారు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
KNR: పీఎం మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్తురాలు. ఇక రాహుల్ గాంధీకి కులం లేదు.. మతం, జాతి, దేశం లేదు. రాహుల్ కులంపై రేవంత్ ఏం సమాధానం చెప్తారు అని ఎద్దేవా చేశారు.
ATP: గుత్తిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణం ప్రధాన రహదారి మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో గుత్తి సీఐ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం ట్రాఫిక్ రద్దీగా ఉండే సర్కిల్లో పోలీసులను నియమించారు.
W.G: జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. పలువురు సెల్ఫీలు దిగారు.
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఆన్లైన్లో కొన్ని పేపర్లలో తప్పుడు రాతలు రాయడం తగదని అన్నారు. ప్రజలు వీటిని నమ్మవద్దని కోరారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం వేకువజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి మూలమూర్తికి సింధూర, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.
SRPT: నేరేడుచర్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం సేవాలాల్ కృషి చేశారన్నారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలం పద్మాపురం గ్రామం సమీపంలో NH5 రోడ్డు పనులకు సూపర్వైజర్గా పని చేస్తున్న ఏనుగు ప్రతాప్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వేమానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.