TG: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
KDP: కలసపాడు మండలం లింగారెడ్డి పల్లెకు చెందిన జర్నలిస్ట్ అమర్నాథ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి మృతితో పలువురు జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
KRNL: మహానంది మండలం తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 18న మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మహబూబ్ దౌలా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని ఆయా శాఖ అధికారులు నివేదికలతో హాజరు కావాలని కోరారు.
NLG: జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్ర పరిసరాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే, పది రోజులపాటు సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 టికెట్ ధరలు చొప్పున పెంచుకునే అవకాశమిచ్చింది.
KMR: తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కామారెడ్డి పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈ మేరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పోలీస్ క్రీడాకారులను ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 వరకు ‘తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్’ నిర్వహించారు.
NRPT: వంట గ్యాస్ కొరతపై అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాపై తక్షణం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలకు నిరంతర సరఫరా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రకాశం: మర్రిపూడి మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఎంఈవో రంగయ్య తెలిపారు. మండలంలో మొత్తం 380 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయినున్నట్లు తెలిపారు. జడ్పీహెచ్ పాఠశాలలో 235 మంది జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు రాయనున్నట్లు చెప్పారు.
NZB: జిల్లాలో శుక్రవారం పర్యటించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రికి కాంగ్రెస్ నేతలు గజమాల వేసి స్వాగతించారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మేయర్ ఉమారాణి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ ఉన్నారు.
ASR: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నగదు రైతులు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు కోరారు. శుక్రవారం వామగెడ్డ ఆర్ఎస్కేలో రైతులతో సమావేశమయ్యారు. పీఎం కిసాన్ 22వ, అన్నదాత సుఖీభవ 3వ ఇన్స్టాల్మెంట్ ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేయడం జరిగిందన్నారు. మండలంలో 10,421 మంది రైతులకు రూ.6,25,26,000 నగదు జమ అయిందన్నారు.
AKP: ఎలమంచిలి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కిసాన్ వికాస్ పథకం కింద 33,648 మంది రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.18.45 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. మునగపాకలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవూర్గ టీడీపీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ మేరకు అల్లూరి జిల్లా నందిగరువు ప్రజలతో పవన్ మాట్లాడనున్నారు. గిరిపుత్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అడవితల్లి బాటలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ ప్రారంభించనున్నారు.
VZM: రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. బొబ్బిలిలో శుక్రవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2,27,700 మంది రైతు కుటుంబాలకు రూ.127.63 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు పేర్కొన్నారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. ఆర్కే కోపరేటివ్ సొసైటీ ఛైర్మన్ కొండూరి రాకేందర్, సొసైటీ మేనేజర్గా రాగం రమేష్లను కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
SDPT: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు DSO తనుజ అధ్యక్షతన జరిగింది. మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ పరిశీలించాలని సూచించారు. చైతన్యంతోనే మోసాలను నివారించవచ్చని తెలిపారు. ఆహార పదార్థాల్లో కల్తీ, తూకాల్లో మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.