KDP: కలసపాడు మండలం లింగారెడ్డి పల్లెకు చెందిన జర్నలిస్ట్ అమర్నాథ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి మృతితో పలువురు జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.