వికారాబాద్ పట్టణంలో నేర నియంత్రణ కోసం ఏర్పాటు చేసే సీసీ కెమెరాల కోసం 22వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంత్ రెడ్డి రూ. లక్ష విరాళం అందించినట్లు పట్టణ సీఐ రఘు కుమార్ తెలిపారు. ఇలాంటివారు ముందుకు వస్తే పట్టణంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా నీడలో పట్టణాన్ని ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు.