VZM: గుంకలాం జగనన్న కాలనీలో మంచినీరు, వీధి లైట్లు సహా మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే పెద్ద కాలనీల్లో ఒకటైన గుంకలాం జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.