GDWL: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మదనపల్లిలో జిల్లా న్యాయ సేవా సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రతి వినియోగదారుడు వస్తువులు, సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రతినిధులు సూచించారు. ఏ వస్తువు కొన్నా ఖచ్చితంగా బిల్ తీసుకోవాలని, మోసపోతే న్యాయపరంగా పోరాడాలని పిలుపునిచ్చారు.