ప్రకాశం: ఐక్య పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. కల్పన తెలియజేశారు. శుక్రవారం కనిగిరి సీఐటీయూ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్, అంగన్వాడి, ఆశ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.