దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఉన్న క్రమంలో.. చత్తీస్ ఘడ్లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా పరిస్థితికి అద్దం పడుతోంది. అక్కడ ఓ పెళ్లి కుటుంబం మూడు రోజులు ఓ హోటల్లో వేడుకను ప్లాన్ చేసింది. హల్దీ, పెళ్లి, రిసెప్షన్ మూడు రోజులకు 3 వేల మంది వస్తారని అంచనాతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. గ్యాస్ కొరత వల్ల హోటల్ యాజమాన్యం సిలిండర్లు తెచ్చుకోవాల్సిన బాధ్యతను పెళ్లి బృందానికే అప్పగించింది.