TG: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.