• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘తులం బంగారంతో కళ్యాణ లక్ష్మీ డబ్బులు ఇవ్వాలి’

KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో నూతనంగా వివాహాలు చేసుకున్నపెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కాంగ్రెస్ మేనిపిస్టో ప్రకారం అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.. జమ్మికుంట – 200, ఇల్లందకుంట – 58, వీణవంక -50 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు మొత్తం 308 ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారు..

February 15, 2025 / 12:45 PM IST

కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

HYD: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైత్లాపూర్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీ ఉండడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 15, 2025 / 12:38 PM IST

‘ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి’

ప్రకాశం: మార్కాపురం ఏమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలో 15వ వార్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని వీధులను మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

February 15, 2025 / 12:35 PM IST

ఐటీ శాఖల ఉద్యోగాలు.. నేడే లాస్ట్

HYD: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానిక ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ తో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇతర సందేహాల కొరకు office@des.iith.ac.in మెయిల్ చేయాలన్నారు.

February 15, 2025 / 12:25 PM IST

కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

ప్రకాశం: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద శనివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 15, 2025 / 12:05 PM IST

కన్న కొడుకును హత్య చేయించిన తల్లి

AP: మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును తల్లి హత్య చేయించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సాలమ్మ మూడో కుమారుడు శ్యాంబాబు మద్యానికి బానిసై దొంగతనాలు చేసేవాడు. ఇటీవల మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లి.. ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

February 15, 2025 / 11:26 AM IST

ఎన్టీఆర్‌ ట్రస్టు సిబ్బందికి అభినందనలు: సీఎం

AP: ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బందికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమాజ సేవలో ఆ ట్రస్టు 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రసంశలు కురిపించారు. ‘ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుస్తూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

February 15, 2025 / 11:21 AM IST

వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాల ఏర్పాటు

AP: వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. వంశీ మొబైల్ కోసం రెండు పోలీసు బృందాలు HYDకు చేరుకున్నాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో అతని ఇంట్లో సోదాలు చేసే అవకాశముంది. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలింపు చేపట్టింది. ఇదిలా ఉండగా.. విజయవాడ సబ్ జైలులో వంశీని భార్య పంకజశ్రీ కలిశారు.

February 15, 2025 / 11:18 AM IST

తమిళనాడులో పర్యటిస్తున్న పవన్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. మదురైలోని అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట ఆయన తనయుడు అకీరానందన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలో ఇవాళ సీఎం చంద్రబాబును పవన్ కలవనున్నట్లు సమాచారం.

February 15, 2025 / 11:16 AM IST

ఆదాయ పన్ను సెలక్ట్ కమిటీలో ఈటలకు చోటు

KNR: కొత్త ఆదాయపు పన్ను 2025ను పరిశీలించటానికి లోక్‌సబ స్పీకర్ ఓం బిర్లా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటిలో 31 మంది ఎంపీలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి చోటు దక్కింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

February 15, 2025 / 11:12 AM IST

దళిత జవాన్‌పై దాడి.. బీఎస్పీ ఆందోళన

KMM: మధిరలో దళిత జవాన్ మనోజ్‌పై అగ్రవర్ణుల దాడిని ఖండిస్తూ శనివారం బీఎస్పీ నేతలు చింతకాని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి నాగేశ్వరరావు స్పందిస్తూ, దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి డిప్యూటీ సీఎం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

February 15, 2025 / 11:11 AM IST

ఎంపీ భరత్కు స్వాగతం పలికిన రైల్వే ఉద్యోగులు

VSP: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ వాల్తేరు డివిజన్‌ను నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోనే ఉంచేందుకు కృషి చేసిన ఎంపీ శ్రీభరత్‌కి విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద రైల్వే ఉద్యోగులు, నాయకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ సీనియర్ విశ్రాంత నాయకుడు చలసాని గాంధీ, రైల్వే నాయకుడు RVSS రావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

February 15, 2025 / 11:09 AM IST

లావేరులో మొక్కలు నాటిన జెడ్పీ సీఈవో

SKLM: లావేరు మండలం పరిధిలోని తాళ్లవలస పంచాయితీ సుభద్రాపురం గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రాజా పాల్గొని, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.వెంకటరాజు, ఈవోపీఆర్డీ పంచాయతీ కార్యదర్శి, వేతనదారులు పాల్గొన్నారు.

February 15, 2025 / 11:04 AM IST

గుమ్మడిదలలో కొనసాగుతున్న నిరసనలు

SRD: జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలో 11వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించారు. శనివారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కార్యాలయం ముందు జేఏసీ రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డంప్ యార్డు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘం నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

February 15, 2025 / 11:02 AM IST

ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

NRPT: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ చిన్నప్పటి నుంచే సేవ గుణం కలిగిన మహానీయుడని, గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి వారిని చైతన్య పరిచిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారన్నారు.

February 15, 2025 / 10:48 AM IST