• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

NRPT: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ చిన్నప్పటి నుంచే సేవ గుణం కలిగిన మహానీయుడని, గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి వారిని చైతన్య పరిచిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారన్నారు.

February 15, 2025 / 10:48 AM IST

ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం

తూ.గో: కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామంలో శివాలయం పక్కన వేంచేసివున్న శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దశమి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11:54 స్వామివారి కళ్యాణం, కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు నిర్వహించనున్నారు. 

February 15, 2025 / 10:44 AM IST

హరిత ధర్మవరమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్

సత్యసాయి: ధర్మవరంలోని బలిజ కల్యాణ మండపం వద్ద హిందూ శ్మశాన వాటికలో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో రూ.1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హరిత ధర్మవరమే లక్ష్యంగా పట్టణంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

February 15, 2025 / 10:43 AM IST

పైనంపల్లి ఏటి వద్ద అక్రమంగా ఇసుక రవాణా

KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి పాలేరు సరిహద్దుల్లో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీల సాయంతో పైనంపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నారని శనివారం స్థానికులు తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

February 15, 2025 / 10:23 AM IST

పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి

KMM: గొల్లగట్టు లింగమంతుల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి 2 రోజుల సెలవు దినాలుగా ప్రకటించాలని అఖిల భారత యాదవ ఖమ్మం జిల్లా ఆధ్యక్షుడు మల్లిబాబు యాదవ్ కోరారు. కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో శనివారం జరిగిన మండల యాదవ సంఘం సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడాతూ.. గొల్లగట్టు లింగమంతుల జాతర అతి పురాతనమైందని, 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిందన్నారు.

February 15, 2025 / 10:10 AM IST

విజయపురి సౌత్‌లో పులుల కదలికలు 

పల్నాడు: వెల్దుర్తి మండలం విజయపురి సౌత్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఐదు పులుల కదలికలను కెమెరాలో గుర్తించామని ఫారెస్ట్ రేంజర్ సుజాత తెలిపారు. పులుల లెక్కింపు పూర్తయినట్లు తెలిపారు. ఒక ఆడ, మగ పులితో పాటు, మూడు పులి పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఫారెస్ట్‌లోకి వెళ్లొద్దని, నీరు కోసం గ్రామాలలోకి పులులు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

February 15, 2025 / 10:05 AM IST

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్

SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని కరెంట్ సబ్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంధువుల దినకర్మకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

February 15, 2025 / 09:48 AM IST

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

February 15, 2025 / 09:41 AM IST

ఈ నెల 16న కరాటే టోర్నమెంట్

ప్రకాశం: అద్దంకి పట్టణంలో నెల 16న కరాటే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. కరాటే, కుంగ్ ఫూ పోటీలు నేషనల్ లేవల్లో జరుగుతున్నాయని చెప్పారు. సీనియర్ కరాటే మాస్టర్లు రాంబాబు, రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అద్దంకిలోని గీతా మందిరం వద్ద ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలియజేశారు.

February 15, 2025 / 09:04 AM IST

సాయిబాబాను తాకిన సూర్యకిరణాలు

ప్రకాశం: పొదిలి పట్టణంలోని రథం బజార్లో ఉన్న సాయిబాబా దేవస్థానంలో సాయిబాబాను శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. గర్భగుడిలోని స్వామివారిపై 10 నిమిషాల పాటు కిరణాలు ప్రసరించాయి. ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల కమ్మల నీడను చీల్చుకుని సూర్యకిరణాలు గర్భగుడిని తాకడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

February 15, 2025 / 08:58 AM IST

ఘంటసాల ది గ్రేట్ చలనచిత్రానికి మంచిస్పందన

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్లో విడుదలైన ఘంటసాల ది గ్రేట్ చలన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని చిత్ర దర్శకుడు రామారావు తెలిపారు. థియేటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఒక గాయకుడికి పూర్తి నిడివి చిత్రాన్ని రూపొందించామన్నారు. అంతేకాకుండా నేటి తరానికి ఆయనను పరిచయం చేసినట్లే అవుతుందని స్పష్టం చేశారు.

February 15, 2025 / 08:23 AM IST

మండపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

SKLM: ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి సర్పంచ్ పిట్ట శశిరేఖ చెక్ పవర్‌ను రద్దు చేసినట్టు ఎంపీడీఓ రామారావు శుక్రవారం తెలిపారు. 2021 నుంచి 2025 వరకు నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య పనుల్లో సర్పంచ్ రూ.85 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్లు పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు.

February 15, 2025 / 08:21 AM IST

చివరి పొలం వరకు నీటిని అందించాలి

ADB: ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ఆయకట్టుల పరిధిలో ఉన్న చివరి పొలాల వరకు సాగునీటిని అందించాలని రైతులు కోరారు. సదర్మాట్ పరిధిలో కడెం, ఖానాపూర్, కడెం ప్రాజెక్టు పరిధిలో దస్తురాబాద్, కడెం, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో ఉన్న రైతులు యాసంగి సీజన్లో వరి, తదితర పంటలు వేశారు. ఆ పంటల పూర్తి వరకు నీటిని అందించాలని రైతులు కోరారు.

February 15, 2025 / 08:14 AM IST

ఆన్‌లైన్‌లో రూ.1.55లక్షల స్వాహా

కృష్ణా: సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్ కు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు  వస్తాయని మెసెజ్ వచ్చింది. దీంతో ఆయన విడతల వారీగా రూ.1.55లక్షలు పెట్టుబడి పెట్టారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయాయనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

February 15, 2025 / 08:11 AM IST

రాష్ట్ర స్థాయి క్రీడల్లో NLG పోలీసులకు మెడల్స్

NLG: మూడురోజులుగా తెలంగాణా జైళ్ల శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో NLG పోలీసులు గోల్డ్ మెడల్స్ సాధించారు. వాలీబాల్ విభాగంలో వస్కుల శ్రావణ్, కరాటే విభాగాలలో పరాశరన్ బంగారు పథకాలు సాధించడం పట్ల జైలు సూపరింటెండెంట్ ప్రమోద్, జైలు అధికారులు బాలకృష్ణ, నరేశ్ అభినందించారు.

February 15, 2025 / 08:09 AM IST