ASR: గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. 21వేల మంది విద్యార్థులు గత 5నెలలుగా యోగ సాధన చేస్తూ సోమవారం అరకులో 108సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డ్ సాధనకు ముందుకు రావడం హర్షించే విషయమన్నారు. యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 5మండలాలకు చెందిన సుమారు 21,850 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
HYD: ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన GRMB సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఈఎన్సీలు హాజరయ్యారు. వీటిలో పలు అంశాలపై చర్చించారు.
ప్రకాశం: కొండపి మండలం K. ఉప్పలపాడులో జరిగిన లైంగిక దాడి ఘటనపై కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును దర్యాప్తు చేసిన కనిగిరి సబ్ డివిజన్ డీఎస్పీ సాయి ఈశ్వర్ ముద్దాయిని అరెస్టు చేసి కనిగిరి కోర్టులో సోమవారం ప్రవేశపెట్టారు. కాగా కనిగిరి కోర్టు జడ్జి ముద్దాయికి 11 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రేమ్ తెలిపారు.
VZM: కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని గుండాలపేట వద్ద సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు GRP ఎస్సై బాలాజీరావు తెలిపారు. మృతుడి వయస్సు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటాయన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు హెచ్సి కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRD: దక్షిణ కాశీగా పేరుగాంచిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్ సంగమేశ్వర్ 11 మంది సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారుచేసి ఇవ్వాలని అన్నారు.
SRD: టెక్నాలజీకి మహిళల శక్తి తోడైతే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉద్యానవన పంటలకు మహిళలు డ్రోన్ ద్వారా సేవలందిస్తే అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు. డ్రోన్ శిక్షణను రాష్ట్రంలో మొదటిసారిగా మన జిల్లాలోనే ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
SRPT: ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని, ఆదివాసి జాతి హననాన్ని ఆపాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వర రావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని లాల్ బంగ్లాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలోని సోమవారం అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సింగరాయకొండ సీఐ హజరత్ అయ్యా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వారి వద్ద నుండి 41 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను రిమాండ్కు తరలిస్తునట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.
HYD: సచివాలయంలో HCU టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చలు నిర్వహించారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీలోపు పన్నులు చెల్లించిన వారికి పన్నులో 5 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BPT: సంతమాగులూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా తెల్లప్రోలు రమేష్ నియమితులైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోమవారం సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు ప్రజాప్రతినిధులు రమేష్ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
NLG: నకిరేకల్లోని మీసేవ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీనివాస్ గౌడ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మీ సేవ కేంద్రాల నిర్వహణ తీరుపై సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. పట్టణంలో 13 మీ సేవా కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు.
HYD: HCU భూములపై AI వీడియోలు, ఫోటోలు పెట్టారని కొందరిపై కేసులు పెట్టాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కోర్టు నిరాకరించింది. కేటిఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా మరికొందరు ప్రముఖులను ప్రాసిక్యూట్ చేయాలని హైకోర్టును కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ రూరల్ అధ్యక్షునిగా నియామకమైన రాజగోపాల్ గౌడ్ను సోమవారం రాజేందర్ నగర్ డివిజన్ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పసుపుల సందీప్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించారు. ఈ కార్యక్రమంలో హరికిషన్, రజినీకాంత్ గుప్తా, మల్లేష్ చారి, సుధాకర్ రెడ్డి, విజయ్ యాదవ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
AP: వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదని షర్మిల వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యం పెరగడానికి కారణం టీడీపీ కారణమని చెప్పడం వారి వెర్రితనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పుంజుకుంటుంటే చూసి ఓర్వలేక నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా నీచపు చేష్టలు మారలేదని అన్నారు.