GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నేరుగా రావడమే కాకుండా, ‘మీకోసం’ వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వేగంగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.