NLG: పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్లు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లేక అవి నిరుపయోగంగా మారాయని జిల్లాలోని ఆయా గ్రామాల పశుపోషకులు తెలిపారు. కొన్నిచోట్ల పాక్షికంగా ధ్వంసం కాగా మరికొన్ని గ్రామాల్లో వ్యర్థాలతో నిండుతున్నాయన్నారు. వేసవి దృష్ట్యా అధికారులు వినియోగంలోకి తీసుకురావాలని పశుపోషకులు కోరుతున్నారు.