BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 200 మంది సందర్శించగా, 100 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.