NLG: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని చిట్యాల పశువైద్యాధికారి వనం అభినవ్ సూచించారు. రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ పశువులకు టీకాలు వేయించి ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు. టీకాల ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి పశువులను రక్షించుకోవచ్చని, ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.