TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఢిల్లీలో చిట్చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ రావడం వెనుక ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. పోలీసులు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నారని, డ్రగ్స్ నియంత్రణలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. దోషులను వదిలిపెట్టేది లేదని ధీమా వ్యక్తం చేశారు.